Priyamani| ఒకప్పటి అందాల హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలరిస్తుంది. అప్పుడప్పుడు బుల్లితెరపై అలానే ఓటీటీలోను తెగ సందడి చేస్తుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ సినిమాలు, లెక్కకు మించి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ప్రియమణి పెద్ద హీరోల పక్కన మాత్రం కథానాయికగా నటించే అవకాశం దక్కలేదు. రాజమౌళి యమదొంగలో హీరోయిన్ గా తారక్ పక్కన జోడి కట్టి ఎంతగానో అలరించిన ఈ భామ రీసెంట్గా షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ జవాన్ లో కూడా ముఖ్యమైన పాత్ర పోషించి అలరించింది . కేరళలో బ్లాక్బస్టర్గా నిలిచిన మోహన్లాల్ కోర్ట్రూమ్ డ్రామా నెరులో కూడా కీలక పాత్ర పోషించి మెప్పించింది.
ప్రియమణి ప్రస్తుతం అజయ్ దేవగన్ తో మైదాన్ ప్రమోషన్లో బిజీగా ఉంది. 100 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించిన నేపథ్యంలో మూవీకి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. చిత్రంలో అజయ్ దేవగణ్ భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. అయితే రీసెంట్గా ఈ మూవీ స్క్రీనింగ్ జరిగింది. ఈ సినిమాకి చిత్ర నిర్మాత అయిన బోనీ కపూర్తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. బోని కపూర్ స్క్రీనింగ్ వెలుపల అతిథులతో ముచ్చటిస్తూ ఉన్న సమయంలో ప్రియమని చీరకట్టులో అక్కడికి రాగా, ఆమెని ఆహ్వానించాడు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్స్ వారిద్దరిని ఫోటోలకి పోజులివ్వమని అడగగా, బోని కపూర్ ఆమెతో కాస్త వల్గర్గా బిహేవ్ చేశాడు.
ప్రియమణి నడుముపై, భుజంపై చేతులు వేసి ఫొటోలకి పోజులు ఇవ్వడం నెటిజన్స్కి నచ్చలేదు. అనుచితంగా ఆయన తాకినట్టు ఫీలవుతున్న నెటిజన్స్ బోని కపూర్ని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. పెళ్లీడుకి వచ్చిన ఇద్దరు ఆడపిల్లలని పెట్టుకొని ఓ నటితో నువ్వు అలా ఎలా ప్రవర్తిస్తావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బోనిని తిట్టిపోస్తున్నారు. అయితే 2003లో నీతాముఖేష్ అంబాని కల్చరల్ సెంటర్ ప్రారంభించిన సమయంలో జిగి నడిద్ నడుముపై చేతులు వేసి విమర్శల బారిన పడ్డాడు. మళ్లీ అలానే చేయడంతో ఓ రేంజ్లో బోనిని ఆడుకుంటున్నారు.