Minister Ponnam | కేటీఆర్పై కేసు నమోదు చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
కేటీఆర్పై ఎన్నికల కమిషన్ సుమోటో గా తీసుకొని కేసు నమోదు చేయాలి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధాత, హైదరాబాద్ :
కేటీఆర్పై ఎన్నికల కమిషన్ సుమోటో గా తీసుకొని కేసు నమోదు చేయాలి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు రూ.5 వేలు అడుక్కోండి అని చెప్పడాన్ని అక్షేపించారు. కేటీఆర్ పై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ పక్షాన పిర్యాదు చేస్తామ అని చెప్పారు. ఓటుకు 5 వేల చొప్పున ప్రస్తావన తెచ్చిన అంశాన్ని ఎన్నికల కమిషన్ సుమోటో గా తీసుకొని కేటీఆర్ పై కేసు పెట్టాలి అని కోరారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు కు రూ.6 వేలు ఇచ్చిన సంస్కృతి బీఆర్ఎస్ పార్టీది అని పొన్నం విమర్శలు గుప్పించారు.
ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తున్నామని, మరింత అభివృద్ధి చేస్తామని విశ్వాసం కలిగిస్తూ ఓట్లు అడుగుతున్నాం అని పొన్నం వెల్లడించారు. జూబ్లీహిల్స్ ప్రజలు.. కంటోన్మెంట్ ఉప ఎన్నిక మాదిరిగా కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపిస్తారు అని ధీమా వ్యక్తం చేస్తారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కు గ్యాస్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, నూతనంగా ఉద్యోగాలు ఇచ్చాం అని వివరించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తూ.. డ్రింకింగ్ వాటర్ ,డ్రైనేజీ ,రోడ్లు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు.
ప్రజా ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచిస్తున్నదని తెలిపారు. ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేలు తీసుకోండి అని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ దుస్థితి చూసి జాలి పడాలి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి బీజేపీ, బీఆర్ఎస్లు కుమ్మకై బీజేపీ మూడంకెలు దాటని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టిందని విమర్శించారు. మీరు బీజేపీ కి వేసినా.. బీఆర్ఎస్ కు.. బీఆర్ఎస్ కు వేస్తే బీజేపీకి వెళ్తుందని ఓటర్లకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించండి మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram