Maharashtra | ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. 15 ఏండ్ల బాలికకు మాయమాటలు చెప్పి, బలవంతంగా అత్యాచారం చేశాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె గర్భం దాల్చింది. పొట్ట లావైందని తల్లి ప్రశ్నించడంతో.. పీరియడ్స్ రావడం లేదని నమ్మబలికింది. చివరకు 9 నెలలు సమీపిస్తుండటంతో.. చేసేదేమీ లేక యూట్యూబ్లో కాన్పుకు సంబంధించిన వీడియోలు చూసింది. ఆ తర్వాత తనకు తానే డెలివరీ చేసుకుంది. పండంటి ఆడబిడ్డ పుట్టగానే ఆ పసికందు గొంతు నులిమి చంపింది బాలిక. […]
Maharashtra | ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. 15 ఏండ్ల బాలికకు మాయమాటలు చెప్పి, బలవంతంగా అత్యాచారం చేశాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె గర్భం దాల్చింది. పొట్ట లావైందని తల్లి ప్రశ్నించడంతో.. పీరియడ్స్ రావడం లేదని నమ్మబలికింది. చివరకు 9 నెలలు సమీపిస్తుండటంతో.. చేసేదేమీ లేక యూట్యూబ్లో కాన్పుకు సంబంధించిన వీడియోలు చూసింది. ఆ తర్వాత తనకు తానే డెలివరీ చేసుకుంది. పండంటి ఆడబిడ్డ పుట్టగానే ఆ పసికందు గొంతు నులిమి చంపింది బాలిక. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో శుక్రవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగ్పూర్కు చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో అతను ఆ బాలికకు మేసేంజర్, వాయిస్ కాల్ మాత్రమే చేసేవాడు. కొన్ని నెలల క్రితం బాలికకు మాయమాటలు చెప్పి తన స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా ఆమె మద్యం తాగించారు. అనంతరం అత్యాచారం చేశాడు.
దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తనకు తప్ప ఇంట్లో ఎవరికీ తెలియనివ్వలేదు. ఇరుగుపొరుగు వారు కూడా బాలిక శరీరాన్ని గమనించి, అనుమానించారు. తల్లి కూడా అడగడంతో తనకు పీరియడ్స్ రావడం లేదని తెలిపింది. మొత్తానికి బాలిక ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు తనకు తానే డెలివరీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన తల్లి ఫోన్లో డెలివరీకి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు చూసింది. ఆ వీడియోల్లో చూపించిన మాదిరిగా బాలిక శుక్రవారం మధ్యాహ్నం డెలివరీ చేసుకుంది. ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆ పసికందు గొంతు నులిమి చంపింది. బిడ్డను ఇంట్లోని ఓ బాక్సులో దాచిపెట్టింది.
తన పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి తల్లి షాక్ అయింది. ఇంట్లో ఉన్న రక్తపు మరకలను చూసి బిడ్డను తల్లి నిలదీసింది. జరిగిన విషయం తల్లికి తెలిపింది బిడ్డ. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు.