Uttar Pradesh విధాత: ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) లోని ఒక ఊరేగింపులో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భవన్పుర్ ప్రాంతంలోని రాలీ చౌహాన్ అనే గ్రామంలో కన్వారియాలు యాత్ర చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురవడంతో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయాలపాలయ్యారు. హరిద్వార్ నుంచి గంగా జలాలను తీసుకొస్తున్న వీరంతా ఒక వాహనంలో ప్రయాణిస్తున్నారు. రాలీ చౌహాన్ గ్రామం వద్దకు వచ్చేసరికి భక్తి పాటలతో కోలాహలంగా ఉన్న వీరి వాహనం బాగా కిందకి వేలాడుతున్న […]
Uttar Pradesh
విధాత: ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) లోని ఒక ఊరేగింపులో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భవన్పుర్ ప్రాంతంలోని రాలీ చౌహాన్ అనే గ్రామంలో కన్వారియాలు యాత్ర చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురవడంతో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయాలపాలయ్యారు.
హరిద్వార్ నుంచి గంగా జలాలను తీసుకొస్తున్న వీరంతా ఒక వాహనంలో ప్రయాణిస్తున్నారు. రాలీ చౌహాన్ గ్రామం వద్దకు వచ్చేసరికి భక్తి పాటలతో కోలాహలంగా ఉన్న వీరి వాహనం బాగా కిందకి వేలాడుతున్న హై టెన్షన్ వైర్ను తాకడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
దీంతో అందులో ఉన్న వారికి తమకు ఏం జరిగిందో తెలిసే లోపే ఒకరి మీద ఒకరు పడిపోయారు. గ్రామస్థులు పక్కనే ఉన్నా ఏం చేయలేని పరిస్థితి.. సబ్స్టేషన్కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం ఐదుగురు తీవ్రగాయాలతో వివిధ ఆసుపత్రులో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
ఉత్తరాదిలో బాగా ప్రాచుర్యం పొందిన కన్వరీ యాత్రలో సుమారు కోటి మంది వరకు పాల్గొంటారు. వీరంతా వాహనాలు, కాలి నడకన ప్రయాణిస్తూ గంగ వద్దకు వెళ్లి.. అక్కడ నీటిని తమ స్వస్థలాలకు తీసుకెళతారు. వీరిని కన్వరీలు అంటారు. ఉత్తర్ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, దిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, ఒడిశాల నుంచి ఈ యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళతారు.