CM KCR దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చ రాహుల్ తెలంగాణకు వచ్చిన మర్నాడే కేసీఆర్తో సమాజ్వాదీ నేత సమావేశం విధాత: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సోమవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణలో భారీ సభలో పాల్గొన్న మరుసటి రోజే అఖిలేశ్ కేసీఆర్తో సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తి రేపింది. బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో బీహార్ సీఎం నితీశ్కుమార్ చొరవతో రూపుదిద్దుకుంటున్న ఫ్రంట్లో […]
CM KCR
విధాత: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సోమవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణలో భారీ సభలో పాల్గొన్న మరుసటి రోజే అఖిలేశ్ కేసీఆర్తో సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తి రేపింది. బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో బీహార్ సీఎం నితీశ్కుమార్ చొరవతో రూపుదిద్దుకుంటున్న ఫ్రంట్లో అఖిలేశ్ ఉన్నారు.
గత నెలలో పాట్నాలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలోనూ అఖిలేశ్ పాల్గొన్నారు. అంతా కలిసి బీజేపీ ముక్త్ భారత్ నినాదం కూడా ఇచ్చారు. పాట్నాలో సమావేశానికి బీఆరెస్కు ఆహ్వానం అందలేదు. తెలంగాణలో బీజేపీకి బీఆరెస్ బీ టీంలా పని చేస్తున్నదని, బీఆరెస్ ఉంటే ఫ్రంట్లో తాము ఉండలేమని చెప్పామని రాహుల్ స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భావి కూటమిలో భాగస్వామిగా ఉంటారని భావించే అఖిలేశ్.. సీఎం కేసీఆర్తో సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
అఖిలేశ్ యాదవ్తో సీఎం కేసీఆర్కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్తో కూడా కేసీఆర్కు మంచి సంబంధాలుండేవి. ఆ బంధాన్ని అఖిలేష్తో కూడా కేసీఆర్ కొనసాగిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేని ప్రత్యామ్నాయం సాధ్యం కాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నితీష్ కుమార్, స్థాలిన్ తదితర సీఎంలు భావించారు. ఇదే ఆలోచనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు.
ఈ మేరకు ఆయన పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి హాజరయ్యారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలంటూ తిరుగుతున్న కేసీఆర్కు జాతీయ స్థాయి నేతలెవ్వరు కూడా స్పందించడం లేదు. నెల 17-18 తేదీల్లో ప్రతిపక్షాలు తమ రెండో భేటీని బెంగళూరులో నిర్వహించనున్నాయి. ఈ సమావేశానికి ఆహ్వానించేందుకు అఖిలేశ్ వచ్చారా? లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉన్నది.
సాదరంగా స్వాగతించిన కేసీఆర్ ప్రగతిభవన్కు వచ్చిన అఖిలేశ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. కొద్ది సేపు చర్చల అనంతరం అఖిలేశ్ బృందానికి కేసీఆర్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలచారి తదితరులున్నారు