విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్లో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి 50 లక్షలు తీసుకున్నాడని, ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు రాధాకిషన్రావుతో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే రాధాకిషన్రావుపై కూకట్పల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.
బెదిరించి కొట్టి తన కుమార్తె పేరిట కొనుగోలు చేసిన ఫ్లాటు సేల్ డీడ్ను బలవంతంగా రద్దు చేయించారని సుదర్శన్కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు రాధాకిషన్రావుపై కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ 4గా ఉన్న రాధాకిషన్రావు అక్రమాలపై ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే ఇంకోవైపు బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తుండటం…కేసులు నమోదవుతున్న తీరు చూస్తుంటే ట్యాపింగ్ మాటున రాధాకిషన్రావు బృందం సాగించిన బెదిరింపులు, సెటిల్ మెంట్లు, అక్రమ వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయన్నదానికి నిదర్శనంగా కనిపిస్తుంది.