Bandi Sanjay | బండి సంజయ్.. బాగా కష్టపడ్డారు: ప్రధాని! కుటుంబ సభ్యులతో మోదీని కలిసిన బండి

Bandi Sanjay తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురండి కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిసిన బండి సంజయ్ విధాత: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను అభినందించారు. […]

  • Publish Date - August 3, 2023 / 11:32 AM IST

Bandi Sanjay

  • తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురండి
  • కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిసిన బండి సంజయ్

విధాత: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతో పాటు వారి యోగ క్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.