Basara IIIT విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలకు, అదృశ్యాలకు కేంద్ర బిందువుగా మారింది. బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా విద్యార్థుల భద్రత విషయంలో పట్టింపు లేనట్లుగా వ్యవహరించడం ఆనవాయితీగా మారింది. ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న వరుస పరిణామాలు విద్యార్థుల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న బన్నీ అనే విద్యార్థి గురువారం ఉదయం ఇంటికి […]
Basara IIIT
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలకు, అదృశ్యాలకు కేంద్ర బిందువుగా మారింది. బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా విద్యార్థుల భద్రత విషయంలో పట్టింపు లేనట్లుగా వ్యవహరించడం ఆనవాయితీగా మారింది. ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న వరుస పరిణామాలు విద్యార్థుల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న బన్నీ అనే విద్యార్థి గురువారం ఉదయం ఇంటికి వెళ్తున్నానంటూ అవుట్ పాస్ తీసుకుని బయటికి వెళ్లిన విద్యార్థి రాత్రి వరకు కళాశాలకు తిరిగి రాకపోవడంతో కళాశాల నిర్వాహకులు వెంటనే బన్నీ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన విద్యార్థి తల్లిదండ్రులకు బన్నీ ఇంటికి వెళుతున్నాను అంటూ అవుట్ పాస్ తీసుకుని వచ్చి తిరిగి రాలేదని సమాచారం అందించారు.
బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చిన బన్నీ తల్లిదండ్రులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. కళాశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా మా అబ్బాయికి అవుట్ పాస్ ఇచ్చి ఎలా పంపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బన్నీతో పాటు అవుట్ పాస్తో బయటికి వెళ్ళిన తన స్నేహితులను విచారించగా మాతో బయటికి వచ్చాడు కానీ ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అని తెలిపారు. బన్నీ దగ్గర ఉన్న మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో తీవ్ర ఆందోళనకు లోనైన బన్నీ తల్లిదండ్రులు వెంటనే ఎలాగైనా తన కొడుకు ఆచూకీ కనుగొనలని పోలీసులను ఆశ్రయించారు. బాసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.