Bhatti Vikramarka | వైఎస్సార్కు నివాళీ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విధాత, హైద్రాబాద్, దివంగత సీఎం వైఎస్. రాజశేఖర్రెడ్డి ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెలుతుందని, ఆయన కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం గాంధీ భవన్లో నిర్వహించిన వైఎస్సార్ 14వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి సీడబ్ల్యుసీ సభ్యులు రఘువీరారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ […]
Bhatti Vikramarka |
విధాత, హైద్రాబాద్, దివంగత సీఎం వైఎస్. రాజశేఖర్రెడ్డి ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెలుతుందని, ఆయన కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం గాంధీ భవన్లో నిర్వహించిన వైఎస్సార్ 14వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి సీడబ్ల్యుసీ సభ్యులు రఘువీరారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు పక్షపాతి డాక్టర్ వైయస్సార్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం రోజున ఉచిత కరెంటు ఫైలు పై సంతకం చేసిన మాట తప్పని మహానాయకుడన్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేటెంట్ అన్నారు. ఉచిత కరెంటు గురించి మాట్లాడే అర్హత ఇతరులకు లేదన్నారు. రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసిన చరిత్ర వైఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీది మాత్రమేనన్నారు.
పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన మానవతావాది డాక్టర్ వైయస్సార్ అని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో సాంకేతికంగా, సాఫ్ట్ వేర్ రంగాల్లో ప్రావీణ్యం పొంది పేద విద్యార్థులు స్థిరపడడానికి వైఎస్సార్ తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎంతో దోహదం చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గుడిసె అనేది లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇంటి స్థలాలు పంపిణీ చేసి ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారన్నారు.
తెలంగాణ పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసి రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు లేకుండా చేశారన్నారు. ఎన్ని ప్రతిబంధకాలు ఉన్న వాటిని అధిగమించి మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన మహా నేత వైయస్సార్ అన్నారు.
జలయజ్ఞం ప్రాజెక్టు ద్వారా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేసి తెలుగు రాష్ట్రాల్లో సాగు తాగునీరు కరువు లేకుండా చేశారన్నారు. వైఎస్సార్ ప్రారంభించిన ఇందిర, రాజీవ్ సాగర్, ప్రాణహిత ప్రాజెక్టులను బీఆరెస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే తెలంగాణలో 24 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేదన్నారు. వైఎస్సార్ మహిళలకు అందించిన పావలా వడ్డీ రుణాలను బీఆరెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు.
వైఎస్సార్కు కాంగ్రెస్ ప్రముఖులు నివాళులు
దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పంజాగుట్ట సర్కిల్లో వైఎస్సార్ విగ్రహానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు, సీడబ్ల్యుసీ సభ్యులు రఘువీరా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.