Delhi |
ఆటోలో వెళుతున్న యువతి చేతిలోని ఐఫోన్ (I Phone)ను గమనించిన ఇద్దరు దుండగులు.. దానిని దొంగలించే క్రమంలో ఆమెను రోడ్డుపై పడేసి బైక్లతో ఈడ్చుకుపోయారు. ఈ భయంకర ఘటన దిల్లీ (Delhi) లో జరిగింది. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యోవికా చౌదరి.. స్కూల్ పూర్తయిన అనంతరం ఇంటికి ఆటోలో బయలుదేరారు.
ఈ క్రమంలో ఆ బాధను భరించలేక బాధితురాలు ఫోన్ను వదిలేయడంతో.. వారు ఆ ఐఫోన్తో చక్కా పోయారు. ఈ ఘటనలో యోవికా ముక్కుకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమేరాల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.