ఆటోను ఢీకొట్టిన లారీ నలుగురు మృతి, ముగ్గురుకి తీవ్రగాయాలు Warangal | విధాత, వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం వరంగల్ నుండి తొర్రుర్ వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ఆటో నుజ్జునుజ్జయ్యిందీ. మృతులు తేనే అమ్ముకునే వారుగా […]
Warangal | విధాత, వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం వరంగల్ నుండి తొర్రుర్ వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ఆటో నుజ్జునుజ్జయ్యిందీ. మృతులు తేనే అమ్ముకునే వారుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.