Bride | ఓ నవ వధువు తనకు పెళ్లైన మరుసటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడాకు చెందిన యువకుడితో సికింద్రాబాద్కు చెందిన అమ్మాయితో జూన్ 26వ తేదీన వివాహం జరిగింది. అదే రోజు రాత్రి నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. తనకు కడుపులో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ఏడు […]
Bride | ఓ నవ వధువు తనకు పెళ్లైన మరుసటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడాకు చెందిన యువకుడితో సికింద్రాబాద్కు చెందిన అమ్మాయితో జూన్ 26వ తేదీన వివాహం జరిగింది. అదే రోజు రాత్రి నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. తనకు కడుపులో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపింది.
దీంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ఏడు నెలల గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇక మంగళవారం పొద్దున్నే నవ వధువు బిడ్డకు జన్మనిచ్చింది.
ఆమె గర్భవతి అన్న సంగతి తమకు తెలుసని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. వరుడు, అతడి కుటుంబానికి ఈ విషయం చెప్పకుండా దాచినట్లు చెప్పారు.
అయితే వధువుకు ఇటీవల రాళ్లు తొలగించే సర్జరీ జరిగిందని, దాని వల్ల ఆమె కడుపు ఉబ్బినట్లుగా వధువు కుటుంబం తమకు చెప్పిందని వరుడి బంధువులు పేర్కొన్నారు. నవ వధువు ఏడు నెలల గర్భిణీ అని డాక్టర్లు చెప్పడంతో తాము షాకైనట్లు తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వరుడు తనకు ఆమె వద్దని చెప్పాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో వధువు కుటుంబ సభ్యులు సికింద్రాబాద్కు తిరిగొచ్చారు. ఈ ఘటనపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.