Bhadradri | శ్రీరామ నవమి( Sriramanavami ) సందర్భంగా ఈనెల 30న భద్రాచలం( Bhadrachalam )లో నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ఒక కోటి రూపాయలను సీఎం కేసీఆర్( CM KCR ) మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా భద్రాచలం దేవస్థానం ఆదాయం కోల్పోయింది. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణకోసం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ […]
Bhadradri | శ్రీరామ నవమి( Sriramanavami ) సందర్భంగా ఈనెల 30న భద్రాచలం( Bhadrachalam )లో నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ఒక కోటి రూపాయలను సీఎం కేసీఆర్( CM KCR ) మంజూరు చేశారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా భద్రాచలం దేవస్థానం ఆదాయం కోల్పోయింది. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణకోసం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు.
ఇక సీతారాముల కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ అనుదీప్, ఆలయ ఈవో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా, భధ్రాచలం దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణకోసం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
— Telangana CMO (@TelanganaCMO) March 28, 2023