Congress విధాత: ప్రజలను మోసం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీలు దొందు దొందేనని, కేసీఆర్ ఝూటా, మోడీ ఝూటా.. దోనో మిల్కే దేశ్ కో లూటా అంటు టీ.పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ విమర్శించారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ లో ప్రధాని మోడీ ప్రసంగం పాత చింతకాయ పచ్చడి లాగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని కుట్రతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ని ఓడిస్తామని కిషన్ రెడ్డి కూడా […]
Congress
విధాత: ప్రజలను మోసం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీలు దొందు దొందేనని, కేసీఆర్ ఝూటా, మోడీ ఝూటా.. దోనో మిల్కే దేశ్ కో లూటా అంటు టీ.పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ విమర్శించారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ లో ప్రధాని మోడీ ప్రసంగం పాత చింతకాయ పచ్చడి లాగా ఉందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని కుట్రతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ని ఓడిస్తామని కిషన్ రెడ్డి కూడా చెప్పడం లేదన్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకి బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. మోడీ అవినీతిపై కేసీఆర్ ఏనాడైనా ప్రశించాడా? అంటు యాష్కీ నిలదీశారు. కేసీఆర్ అవినీతిపై మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ప్రజలను దోచుకోవడంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనన్నారు. బీఆర్ఎస్ బీజేపీనీ తెలంగాణ ప్రజలు బొంద పెట్టాలన్నారు. పార్టీ అధికార ఫ్రతినిధి మల్లు రవి మాట్లాడుతు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే బీసీ నేత బండి సంజయ్ను బీజేపీ కేంద్ర నాయకత్వం పక్కన పెట్టారన్నారు.
తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందనే అధ్యక్షుడిని మార్చారన్నారు. కేసీఆర్ అవినీతిపై మాట్లాడుతున్న ప్రధాని మోడీ ఆయనపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదని, లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయడం లేదన్నారు.