Congress | దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. బీసీల ఓట్లే కీలకం: వీహెచ్‌

Congress బిసి ప్రధాని అయితే సంతోషించా బీసీల సమస్యలపై ఆయనను మూడుసార్లు కలిసా ఎస్సీ ఎస్టీ బీసీలకు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు విధాత, కరీంనగర్ బ్యూరో: దేశంలో ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, బీసీల ఓట్లే కీలకంగా మారాయని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ […]

  • Publish Date - July 25, 2023 / 03:09 PM IST

Congress

  • బిసి ప్రధాని అయితే సంతోషించా
  • బీసీల సమస్యలపై ఆయనను మూడుసార్లు కలిసా
  • ఎస్సీ ఎస్టీ బీసీలకు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం
  • సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు

విధాత, కరీంనగర్ బ్యూరో: దేశంలో ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, బీసీల ఓట్లే కీలకంగా మారాయని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ ఐక్య వేదిక సమావేశo మంగళవారం స్థానిక డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వ‌ర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన మోడీ ప్రధాని అయినందుకు తాను ఎంతో సంతోషించానన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటూ మూడుసార్లు ప్రధానిని కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.

బీసీ జన గణన, బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడం లేదని హనుమంత రావు నిలదీశారు. సోనియా గాంధీకి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించారు తప్ప పదవుల గురించి ఆలోచించలేదని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరిగిందని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున కర్గేను ఏఐసీసీ అధ్యక్షులుగా నియమించడం జరిగిందన్నారు.

బడుగు బలహీన వర్గాల వారిని ఎస్సీ, ఎస్టీలను అధ్యక్షులుగా నియమించే దమ్ము ఇతర పార్టీలకు ఉందా అని నిలదీశారు. బీసీ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని, దేశంలో ఏ పార్టీ అయినా బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఓట్ల ద్వారానే గెలుస్తున్నాయని, అయితే బీసీలను ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. కెసిఆర్ తెలంగాణ ప్రజల డబ్బు బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో పంచుతున్నారని ఇక్కడి రైతులు కేసీఆర్ కళ్ళకు కనపడటం అని ఎత్తిపొడిచారు.

బీసీ నాయకుడైన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో నరేంద్ర మోడీ అవుట్ రాహుల్ గాంధీ ఇన్ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బీసీలకు మూడు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని అన్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 60 శాతం ఉన్న బలహీన వర్గాల వారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు సీట్లు బలహీన వర్గాలకు కేటాయించాలని పీఏసీ కమిటీలో నిర్ణయించినట్టు తెలిపారు. ఎన్నికల ప్రణాళిక కమిటీలో బలహీన వర్గాల వారికి చోటు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. బలహీన వర్గాల వారికి సహాయం చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేల బీసీలకు లక్ష రూపాయల రుణం ఇస్తామని బీసీలను కేసిర్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ క్యాబినెట్లో 18 మంది మంత్రులు ఒక స్పీకర్, శాసనమండలి స్పీకర్ తో కలిపి మొత్తం 20 మంది ఉంటే అందులో ముగ్గురే బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు ఉన్నారని ఆరోపించారు. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నది, చేసింది వి హనుమంతరావు అని అన్నారు.

దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే అని, పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్ యుఐ, మార్క్ఫెడ్ పార్లమెంటు సభ్యులుగా అవకాశం ఇచ్చిందని, ఆయనకు మళ్లీ అవకాశం కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు చెందిన వారిని పిసిసి అధ్యక్షులుగా ఎంతో మందికి అవకాశం కల్పించిందని ఇది వేరే పార్టీల వల్ల అవుతుందా అని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సంజయ్ ను తీసి కిషన్ రెడ్డికి కట్టబెట్టింది అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్కాన్ సింగ్, ఈర్ల కొమురయ్య వైద్యుల అంజన్ కుమార్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఘంటా రాములు, సిరాజు హుస్సేన్, చర్ల పద్మ, ఎండి తాజ్ శ్రావణ్ నాయక్ అబ్దుల్ రహమాన్ మడుపు మోహన్ నాగం కుమార్, సాగరం వెంకటస్వామి ఉరుమెట్ల రాజలింగం కుర్ర పోచయ్య గుండాటి శ్రీనివాస్ రెడ్డి కంకణాల అనిల్ కుమార్ గుప్తా సిరిపురం నాగప్రసాద్ ఇమ్రాన్ ఇన్నారెడ్డి హైమద్ ధర్నా సింగ్ మెతుకు కాంతయ్య పరదాల లింగమూర్తి ములకల యోనా ఊరడి లతా ములకల కవిత వంగల విద్యాసాగర్ పోరండ్ల రమేష్ కుంభాల రాజ్కుమార్ బత్తిని చంద్రయ్య గౌడ్ షబానా మహమ్మద్ షహేన్షా బత్తిని చంద్రయ్య గౌడ్ మాలోతు మహాలక్ష్మి వాసిమ్ నూనె గోపాల్ రెడ్డి కుర్ర పోచయ్య అంతగిరి బాల పోచయ్య ఒగ్గు రమేష్ నెల్లి నరేష్ నదీమ్ శారద బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Latest News