విధాత: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శ్రీరామనవమి పర్వదినం గురువారం రాత్రి డీజే మోతలు, రికార్డింగ్ డ్యాన్స్ లు హోరెత్తాయి. స్థానిక రామాలయం శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఏటా కొనసాగుతున్నట్లుగానే ఈ ఏడాది కూడా డీజేలతో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. అయితే ఇది ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకునే క్రమంలో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. ఏకంగా గ్రామంలో ఆరు చోట్ల డీజేలతో రికార్డింగ్ […]
విధాత: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శ్రీరామనవమి పర్వదినం గురువారం రాత్రి డీజే మోతలు, రికార్డింగ్ డ్యాన్స్ లు హోరెత్తాయి.
స్థానిక రామాలయం శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఏటా కొనసాగుతున్నట్లుగానే ఈ ఏడాది కూడా డీజేలతో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. అయితే ఇది ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకునే క్రమంలో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు.
ఏకంగా గ్రామంలో ఆరు చోట్ల డీజేలతో రికార్డింగ్ డాన్సులు పెట్టి జనాన్ని ఊర్రుతలూగించారు. స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్ వర్గీయులు , ఎమ్మెల్సీ ఎంసి.కోటిరెడ్డి, కాంగ్రెస్ నుండి జానారెడ్డి అనుచరులు పోటా పోటీగా వేరువేరుగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటాక కూడా రికార్డింగ్ డాన్సులు కొనసాగాయి.
డాన్సర్లతో పాటు జనం కూడా చిందులేశారు. అయితే వీటన్నింటికీ దూరంగా ఉండే భక్తులు మాత్రం డీజే సౌండ్ లు, రికార్డింగ్ డాన్స్ ల మోతలతో ఇబ్బంది పడ్డారు. అర్ధరాత్రి దాటాక కూడా పోలీసులు వాటిని ఆపించకపోవడంతో సాధారణ జనం నిద్రకు దూరమై పండుగ రోజు కూడా ఇదేమి తిప్పలురా దేవుడా అని ఉసూరుమనుకున్నారు.