Warangal: పాలభిషేకాలు చేయొద్దు.. నాకర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా: పోలీస్ కమిషనర్ AV.రంగనాథ్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నా ఉద్యోగ నిర్వహణలో భాగంగా భూ తగాదాలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తున్నాను. భూ బాధితులు ఎవరు తన చిత్రాలతో కూడిన ప్లెక్సీలకు పాలభిషేకాలు చేయొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ.రంగనాథ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు భూకబ్జాలకు సంబంధించిన కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తుండంతో న్యాయం పొందిన బాధితులు పోలీస్ కమిషనర్ రంగనాథ్ పై తమ అభిమానం చాటుతూ పోలీస్ కమిషనర్ […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నా ఉద్యోగ నిర్వహణలో భాగంగా భూ తగాదాలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తున్నాను. భూ బాధితులు ఎవరు తన చిత్రాలతో కూడిన ప్లెక్సీలకు పాలభిషేకాలు చేయొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ.రంగనాథ్ సూచించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు భూకబ్జాలకు సంబంధించిన కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తుండంతో న్యాయం పొందిన బాధితులు పోలీస్ కమిషనర్ రంగనాథ్ పై తమ అభిమానం చాటుతూ పోలీస్ కమిషనర్ చిత్రాలు కూడిన ప్లెక్సీలకు పాలభిషేకాలు నిర్వహించారు. ఈ విషయం పైన వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు పేదవారికి తగురీతిలో న్యాయం చేస్తూ వెన్నంటి వుంటూ నా ఉద్యోగ బాధ్యతలో భాగంగా విధులు నిర్వర్తిస్తూ నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. ఇదే రీతిలో వరంగల్ కమిషనరేట్ కు చెందిన ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది సైతం తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతయుతంగా నిర్వహిస్తూ నిరుపేదలకు న్యాయం అందిస్తున్నారు. తద్వారా కమిషనరేట్ పరిధిలో పలు భూకబ్జా కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తుండంతో తిరిగి తమ భూములను పొందిన బాధితులు తనకు కృతజ్ఞతలు తెలిపేందుకు పాలభిషేకాలు చేయడం సరికాదన్నారు.
నిరంతరం శాంతి భద్రతలను పరివేక్షించడం, పేద వర్గాలకు న్యాయం అందించాల్సిన బాధ్యత తనపై వుందన్నారు. ఇందులో భాగంగా భూకబ్జా కేసులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో లోతుగా విచారణ జరిపి, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ విభాగాలతో పాటు సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో చట్ట పరిధిలో బాధితులకు న్యాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిరంతరం బాధితుల పక్షాన నిలుస్తారని, బాధితులకు న్యాయం చేయడం పోలీసుల కర్తవ్యంలో ఒక భాగమేనని, కావున పోలీసులపై అభిమానాన్ని చాటేందుకు పాలభిషేకాలు చేయాల్సిన అవసరం లేదని పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రజలకు సూచించారు.