Exploding Electric Vehicle| పేలిన ఎలక్ట్రిక్ వాహనం…మహిళ మృతి

విధాత : ఎలక్ట్రిక్ వాహనాలు తరచు పేలిపోతు వాహనదారులు భయపెడుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం పేలిన ఘటనలో ఓ మహిళ ప్రాణం కూడా కోల్పోయింది. యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూటీకి ఛార్జింగ్ అవుతుండగా పేలుడు చోటుచేసుకుంది. దీంతో పక్కనే నిద్రిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని వెంకట లక్ష్మమ్మ (62)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
వాహనం పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఫోరెన్సిక్ టీంను రప్పించారు. అలాగే ఈ బైక్ తయారీ సంస్థకూ ఘటనపై సమాచారం అందించారు.