Khammam | భార్యకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో.. భర్త, వారి కూతురు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దిక్కు తోచని స్థితిలో మామిడి తోటలో ముగ్గురు ఉరేసుకున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తకారాయగూడెంకు చెందిన పోట్రు కృష్ణయ్య(40), సుహాసిని(35) అనే దంపతులకు అమృత(19) అనే కుమార్తె ఉంది. అయితే అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సుహాసినికి నెలన్నర క్రితం కృష్ణా జిల్లా తిరువూరులో గర్భసంచికి […]
Khammam | భార్యకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో.. భర్త, వారి కూతురు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దిక్కు తోచని స్థితిలో మామిడి తోటలో ముగ్గురు ఉరేసుకున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్తకారాయగూడెంకు చెందిన పోట్రు కృష్ణయ్య(40), సుహాసిని(35) అనే దంపతులకు అమృత(19) అనే కుమార్తె ఉంది. అయితే అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సుహాసినికి నెలన్నర క్రితం కృష్ణా జిల్లా తిరువూరులో గర్భసంచికి శస్త్రచికిత్స చేశారు.
ఆమె నమూనాలను సేకరించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా, క్యాన్సర్గా నిర్ధారణ అయింది. ఈ విషయం కృష్ణయ్య కుటుంబ సభ్యులకు గురువారం తెలిసింది. దీంతో వైద్యులు కీమో థెరపీకి హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. సుహాసినికి క్యాన్సర్ అని తేలడంతో ముగ్గురు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఇక హైదరాబాద్ వెళ్లకుండా తిరువూరు నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. తిరువూరులోనే మూడు స్టూల్స్, తాళ్లను కొనుగోలు చేశారు. అనంతరం కొత్తకారాయిగూడెంలోని తమ మామిడి తోటకు చేరుకున్నారు. గురువారం రాత్రి తోటలో ముగ్గురు ఉరేసుకున్నారు.
శుక్రవారం ఉదయం కృష్ణయ్య, సుహాసిని, అమృత చెట్లకు వేలాడుతుండటం స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.