Road Accident | ఏపీలో ఘోర ప్ర‌మాదం.. ఐదుగురు తెలంగాణ కూలీలు మృతి

Road Accident | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌ల్నాడు జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. దాచేప‌ల్లి మండ‌లం పొందుగ‌ల వ‌ద్ద కూలీల‌తో వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్ర‌యాణిస్తున్న కూలీల్లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 10 మంది కూలీలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్ష‌త‌గాత్రుల‌ను గుర‌జాల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన […]

  • Publish Date - May 17, 2023 / 01:20 AM IST

Road Accident | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌ల్నాడు జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. దాచేప‌ల్లి మండ‌లం పొందుగ‌ల వ‌ద్ద కూలీల‌తో వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్ర‌యాణిస్తున్న కూలీల్లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 10 మంది కూలీలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్ష‌త‌గాత్రుల‌ను గుర‌జాల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆటోలో 23 మంది కూలీలు ఉన్న‌ట్లు స‌మాచారం.

బాధిత కూలీలంతా తెలంగాణలోని నల్లగొండ జిల్లా దామ‌రచెర్ల మండలం నర్సాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. వారంతా గురజాల మండలం పులిపాడుకు కూలీ ప‌నుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News