GHMC | నోటరీ స్థలాల క్రమబద్దీకరణకు నెల రోజుల గడువు పెంపు

GHMC త్వరలో జీవో విడుదల గ్రేటర్‌ ఎమ్మెల్ల్యేల సమావేశంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం విధాత: నోటరీ స్థలాల క్రమబద్దీకరణకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఈ మేరకు నగర ఎమ్మెల్ల్యేలతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, వారికి న్యాయపరమైన హక్కులను […]

  • Publish Date - May 1, 2023 / 09:00 AM IST

GHMC

  • త్వరలో జీవో విడుదల
  • గ్రేటర్‌ ఎమ్మెల్ల్యేల సమావేశంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం

విధాత: నోటరీ స్థలాల క్రమబద్దీకరణకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఈ మేరకు నగర ఎమ్మెల్ల్యేలతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, వారికి న్యాయపరమైన హక్కులను కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజల ను సీఎం కోరారు. తక్షణమే తమ తమ నియోజకవర్గాల పరిధిల్లోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలుపుకోవాలన్నారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం తెలిపారు.

ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే సందర్భంలో.. వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సిఎం అన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నామని తెలిపారు. గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్ల్యేల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి; ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, నవీన్ కుమార్; బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్, సీఎం ఓ ఎస్‌డీప్రియాంకవర్గీస్ తదితరులు పాల్గొన్నారు