పసిడి మెరుపులు.. సామాన్యులు బేజారు..! మరోసారి పైపైకి బంగారం ధరలు..!
సామానులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండో రోజు బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు పెరిగాయి

Gold Rates | సామానులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండో రోజు బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.400 పెరిగి.. తులానికి రూ.58,900కి ఎగిసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.430 పెరిగి.. తులం ధర రూ.64,250కి దూసుకెళ్లింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.59,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.64,850కి పెరిగింది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,900 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.64,250కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.59,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.64,400కు పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.58,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.64,900 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి సైతం స్వల్పంగా పెరిగింది. రూ.300 పెరిగి కిలో రూ.79,500 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్లో కిలో వెండి రూ.81వేలకు పెరిగింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు పెరుగుతుండడంతో దేశీయంగానూ రేట్లు పెరుగుతున్నాయి. వాస్తవానికి బంగారం, వెండి, ప్లాటినం ధరలు రోజూ మారుతూ వస్తుంటాయి.
ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ ఇలా ఎన్నో కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.