విధాత: బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఇటీవలకాలంలో భారీగా పెరుగుతున్న ధరలు సోమవారం బులియన్ మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి రూ.57,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,350 పలుకుతున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,500 వద్ద ట్రేడవుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.57,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,350 వద్ద నిలకడగా ఉన్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,890 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,350 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కిలో వెండి రూ.78వేలు పలుకుతున్నది.