KA Paul | నన్ను గెలిపిస్తే మీరు షాక్ అయ్యే అభివృద్ధి చేస్తా

నన్ను గెలిపిస్తే... మీరు షాక్ అయ్యే అంతగా ఏపీని అభివృద్ధి చేస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కోన్నారు

  • Publish Date - April 17, 2024 / 05:20 PM IST

ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌
సోషల్ మీడియాను ఊపేస్తున్న పాల్ ఎన్నికల ప్రచార పాట

విధాత: నన్ను గెలిపిస్తే… మీరు షాక్ అయ్యే అంతగా ఏపీని అభివృద్ధి చేస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కోన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేవశంలో ప్రజాశాంతి ఎన్నికల ప్రచార పాటలను ఆవిష్కరించి మాట్లాడారు. చీకటి కావాలంటే ప్రతి పక్షాలను… వెలుగు కావాలంటే తనను గెలిపించాలని.. తెలివైన ఓట్లర్లు తనను గెలిపిస్తారన్నారు. గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నానని, రేపు విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు తెలిపారు.

ఆంధ్రలో 30 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే… తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా.. ఆంధ్రాను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. కోడి కత్తి డ్రామా లాంటిదే గులక రాళ్ల దాడులు అని.. అధికార, ప్రతి పక్షాలు రాళ్లదాడుల పేరుతో నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. నన్ను కూడా చంపాలని చూస్తున్నారని, నాకు నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని ఎదిరించే సత్తా తనకు తప్ప, ఎవరికీ లేదన్నారు. మోదీ బానిసలతో యుద్ధం చేస్తున్నారన్నారు.

మళ్ళీ మోదీ వస్తే.. మణిపూర్ లాంటి ఘటనలు జరుగుతాయని వ్యాఖ్యలు చేశారు. కాగా కేఏ పాల్ విడుదల చేసిన ఎన్నికల ప్రచార పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అన్నా కేఏ పాలన్నా…నువ్వే మాకు కావాలన్న…దేవుడి దూతవన్న..మా పాలిట దేవుడి ఉన్నా…పార్టీ గుర్తు కుండలా మలీనం లేని మట్టికుండలా…చల్లని కుండలా..పాలన్నే మాకు కావాలన్నా..తుప్పు సైకిల్ మాకొద్దన్నా.. పగిలే గ్లాసులు మాకొద్దన్నా.. తిరగని ఫ్యానులు మాకొద్దన్నా.. వాడే పువ్వులు మాకొద్దన్నా అంటూ టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీలను ఈ పాట ద్వారా టార్గెట్ చేశారు.

Latest News