Mancherial | భూమి పూజ అడ్డుకోబోయిన మహిళలు.. అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గెర్రె ప్రాంతంలో నూతనంగా నిర్మించబోతున్న ఆర్టీసీ బస్ డిపోకు ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ భూమి పూజ చేశారు. అయితే బస్ డిపో స్థలం కోసం సర్వే చేసిన భూమి తమదంటూ ముగ్గురు మహిళలు భోగే మల్లేశ్వరి, భోగే రాజేశ్వరి, పెద్ద రాజేశ్వరి భూమి పూజను అడ్డుకొని […]
Mancherial |
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గెర్రె ప్రాంతంలో నూతనంగా నిర్మించబోతున్న ఆర్టీసీ బస్ డిపోకు ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ భూమి పూజ చేశారు. అయితే బస్ డిపో స్థలం కోసం సర్వే చేసిన భూమి తమదంటూ ముగ్గురు మహిళలు భోగే మల్లేశ్వరి, భోగే రాజేశ్వరి, పెద్ద రాజేశ్వరి భూమి పూజను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు భూమిపూజకు ముందుగానే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న తమ భూములను అధికార పార్టీ నాయకులు అక్రమంగా లాక్కొని దానిలో ఆర్టీసీ డిపో కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు డిపో కోసం తీసుకుంటున్న భూమి తమదన్న విషయాన్ని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్కు తెలియజేయడానికి వచ్చిన తమపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని వాపోయారు. ఇలా మహిళలని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక చెన్నూరు తహశీల్ధార్ ఆర్టీసీ బస్ డిపో నిర్మాణ స్థలానికి సర్వే జరుగుతున్న సమయంలో తమకు మరో చోట భూమిని చూపిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఎక్కడా భూమికి బదులు భూమి చూపెట్ట లేదన్నారు. ఇప్పుడు తమకు తెలియకుండా తమ భూమిలో భూమి పూజ చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని మహిళలు వాపోయారు.
గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఆధార పడి బతుకుతున్నామని, తమకు మరో బతుకుతెరువు కూడా లేదని, ఇలా మాలాంటి పేదలపై దౌర్జన్యం చేసి భూములు లాక్కోవడం సరికాదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన తాము కోల్పోయిన తమ భూములను తిరిగి ఇవ్వాలని లేదా మరోచోట అయినా భూమిని ఇవ్వాలని బాధిత మహిళలు కోరారు. వెంటనే తమకు న్యాయం చేయకపోతే తమ భూమిలోనే పురుగుల మందు తాగి చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.