విధాత , గ్రామాల్లో ప్రాచీన ఆలయాలను జీర్ణోదరణతో పునర్వైభవం సంతరించుకునేలా పునర్ నిర్మించుకోవడం అభినందనీయమని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా సూర్యపేట మండలం యండ్లపల్లి గ్రామంలో శ్రీ శ్రీ ఆంజనేయస్వామి, కోదండరామ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నూతన సీతారామలక్ష్మణు, ఆంజనేయ విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
— Jagadish Reddy G (@jagadishBRS) February 16, 2023
ఆలయాలు ప్రజల మధ్య భక్తి భావానికి, ఐక్యతకు చిహ్నాలు అన్నారు. యండ్లపల్లి గ్రామస్తులు ప్రాచీనాలయాన్ని గొప్పగా పునర్ నిర్మించుకున్న తీరుత ఆదర్శనీమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవెల్లి రవీందర్ రెడ్డి , జెడ్పిటిసి జీడీ బిక్షం, ఎంపిటిసి కుంట్ల సరిత అనంతరెడ్డి, సర్పంచ్ దండి సుగుణమ్మ, ఆలయ చైర్మన్ దండి లక్ష్మయ్య, కోశాధికారి కుంట్ల వెంకట నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.