Koppula Eshwar | రేపు సచివాలయంలో ఆలయాల ప్రారంభం విధాత: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాలు, మతాలను గౌరవిస్తారని, అందుకే సచివాలయంలో గుడి, మజీద్, చర్చి నిర్మాణం చేపట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఆయన ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి, మాట్లాడారు. గతంలో చర్చి లేకుండే. ఇవాళ అన్ని మతాలకు అన్ని సౌకర్యాలతో గుడి, మజీద్, చర్చి నిర్మాణం చేపట్టామన్నారు. శనివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ […]
Koppula Eshwar |
విధాత: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాలు, మతాలను గౌరవిస్తారని, అందుకే సచివాలయంలో గుడి, మజీద్, చర్చి నిర్మాణం చేపట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఆయన ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి, మాట్లాడారు. గతంలో చర్చి లేకుండే.
ఇవాళ అన్ని మతాలకు అన్ని సౌకర్యాలతో గుడి, మజీద్, చర్చి నిర్మాణం చేపట్టామన్నారు. శనివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ మాట్లాడుతూ, ఇంత పెద్దగా చర్చి నిర్మాణం చేపట్టడం చాలా గొప్ప విషయమన్నారు.
లుక్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ కూడా ఇలా ప్రభుత్వ నిధులతో చర్చి కట్టించలేదన్నారు. అన్ని మతాలను గౌరవించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కోరుకంటి చందర్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ ఎండి కాంతి వెస్లి, పలువురు క్రిస్టియన్, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.