Viral Video | ఓ వ్యక్తి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడారు. యాక్టివాపై ఏడుగురు పిల్లలను ఎక్కించుకుని రద్దీగా ఉండే ప్రాంతాల్లో రైడింగ్ చేశాడు. ఈ రైడింగ్కు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన యాక్టివాపై ఏడుగురు పిల్లలను ఎక్కించుకున్నాడు. ఆ పిల్లలంతా స్కూల్కు వెళ్లే పిల్లలే. బ్యాగులు కూడా కనిపించాయి. అయితే ఆ ఏడుగురిలో ఒకబ్బాయి భయంకరంగా యాక్టివాకు వెనుకాల ఉండే ఇనుప రాడ్పై నిల్చున్నాడు. ఏ మాత్రం బైక్ […]
Viral Video | ఓ వ్యక్తి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడారు. యాక్టివాపై ఏడుగురు పిల్లలను ఎక్కించుకుని రద్దీగా ఉండే ప్రాంతాల్లో రైడింగ్ చేశాడు. ఈ రైడింగ్కు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన యాక్టివాపై ఏడుగురు పిల్లలను ఎక్కించుకున్నాడు. ఆ పిల్లలంతా స్కూల్కు వెళ్లే పిల్లలే. బ్యాగులు కూడా కనిపించాయి. అయితే ఆ ఏడుగురిలో ఒకబ్బాయి భయంకరంగా యాక్టివాకు వెనుకాల ఉండే ఇనుప రాడ్పై నిల్చున్నాడు. ఏ మాత్రం బైక్ స్కిడ్ అయినా పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే.
నిర్లక్ష్యంగా రైడ్ చేస్తున్న ఆ వ్యక్తిని మరో వాహనదారుడు తన మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై పోలీసులు కూడా ఓ లుక్కేశారు. ముంబైలోని టార్డియో పోలీసులు.. నిర్లక్ష్యంగా రైడింగ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 308 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
Not the ride we support!
This rider had put the life of all pillion riders and others in danger.
A serious offence u/sec 308 IPC for attempt to commit culpable homicide not amounting to murder has been registered against the accused rider. #FollowRules #SetRightExample https://t.co/PKgCY0grhN pic.twitter.com/q2VmoRi8oj
— Mumbai Traffic Police (@MTPHereToHelp) June 25, 2023