ప్యాకేజీలు, లీకేజీల పాలనలో తెలంగాణ అని ఆరోపణ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదవ తరగతి పేపర్ లీక్ వ్యవహారంపై హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ ను మంగళవారం ముట్టడించారు. అనంతరం కేసిఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తదనంతరం మెమోరాండం సమర్పించారు. తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కలకలం రేపుతున్న వేళ తాజాగా మొదలైన పదవ తరగతి పరీక్ష తెలుగు, హిందీ పేపర్ల లీకేజీ బయటకు […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదవ తరగతి పేపర్ లీక్ వ్యవహారంపై హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ ను మంగళవారం ముట్టడించారు. అనంతరం కేసిఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తదనంతరం మెమోరాండం సమర్పించారు.
తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కలకలం రేపుతున్న వేళ తాజాగా మొదలైన పదవ తరగతి పరీక్ష తెలుగు, హిందీ పేపర్ల లీకేజీ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది, క్వశ్చన్ పేపర్స్ వాట్స్అప్ గ్రూప్ లలో చక్కర్లు కొట్టడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పేపర్ లీకేజీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అని యూత్, విద్యార్థి నాయకులు విమర్శించారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పి.రామకృష్ణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, యూత్ కాంగ్రెస్ వెస్ట్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ తోట పవన్, జిల్లా NSUI అధ్యక్షుడు పల్లకొండ సతీష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంక సంపత్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ వంశీకృష్ణ, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.