భారత్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓలా సరికొత్త ఐడియాతో ముందుకువస్తున్నది
Ola Scooter Rent | భారత్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓలా సరికొత్త ఐడియాతో ముందుకువస్తున్నది. కంపెనీ త్వరలోనే ఈ-స్కూటర్ రెంటల్ సర్వీసులను ప్రారంభించబోతున్నది. కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్గా మారింది. ‘పర్యాటక ప్రాంతాల్లో ఓలా ఎస్1 ఉత్పత్తులను రెంటర్ సర్వీస్లు ప్రారంభించాలని ఆలోచిస్తున్నామన్న ఆయన.. దీనిపై స్పందన, సూచనలను కోరారు. అంతే కాదండోయ్ దేశంలోని ఏ ప్రాంతాల్లో ఈ సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నారని తెలుసుకోవడంతో పాటు బెస్ట్ కామెంట్, సూచనలు చేసిన ఒకరికి ఓలా ఎస్ఎక్స్ ప్లస్ను గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఓలా ఎలక్ట్రిక్ రెంటల్ సర్వీసులు ప్రస్తుతం మొదటి దశలోనే ఉంది. ప్రస్తుతం రెంటల్ సర్వీసులు ప్రారంభిస్తే ఎలా ఉంటుంది ? అనే దారిపై కంపెనీ భావిస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ సీఈవో సోషల్ మీడియా వేదికగా సూచనలు కోరారు. అయితే, ఈ ఆలోచన కార్యరూపం దాలిస్తే చాలా ప్రయోజాలే ఉంటాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల యాక్సెసబిలిటీ, అఫార్డెబులిటీ పెరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే, ప్రస్తుతం భారత్లో రెంటల్ బిజినెస్ ఊపందుకుంటున్నది. రెంటల్ బిజినెస్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పటికే ఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో సేవలను తీసుకురాగా.. 300 వరకు ద్విచక్ర వాహనాలను అందుబాటులో ఉంచింది. ఈ సందర్భంగా 40కిపైగా మోటార్ సైకిల్ రెంటల్ ఆపరేటర్స్తో ఒప్పందం చేసుకుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి..
ఇప్పటికే రెంటల్ రంగంలోకి ప్రవేశించిన రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కంపెనీ సేవలను పరిశీలించి.. ఈ మేరకు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఓలా ప్రస్తుత ఆలోచన అమలులోకి వస్తే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న కంపెనీ మొబైల్ యాప్లో ఈ సేవలను తీసుకువచ్చే ఆలోచనలో ఓలా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పర్యాటక ప్రాంతాల్లో బైక్ రెంటల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. బైక్స్, స్కూటర్ని తీసుకుని టూర్ను ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గోవా, మనాలి, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఈ బైక్ రెంటల్ బిజినెస్ జోరుగా సాగుతున్నది. ఓలా ఆలోచన అమలులోకి వస్తే ఈ ఏడాది తొలినాళ్లలోనే సేవలు అందబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.