Old Pension | పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రకు.. టీజీవో, ట్రెసా సంఘాల మద్దతు
Old Pension విధాత, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు పలు సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో పాత పెన్షన్ పునరుద్ధరించడానికి సీపీయస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఈ యాత్రకు టి.జి.ఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, […]

Old Pension
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు పలు సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో పాత పెన్షన్ పునరుద్ధరించడానికి సీపీయస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఈ యాత్రకు టి.జి.ఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పి ఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, అగ్రి కల్చర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి పర్వత రెడ్డి, క్లాస్ ఫోర్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ తదితరులు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఉధ్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు సామాజిక భద్రత కోసం చేపట్టే ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆగస్టు 12న చలో హైదరాబాద్ సంపూర్ణ మద్దతుతో పాటు తమ సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్తో కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.