Pawan Kalyan: షాకింగ్ న్యూస్.. మూడో భార్య‌తోను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ విడాకులు..!

Pawan Kalyan: గ‌త కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ విడాకుల అంశంతో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఒక వ్య‌క్తిని పెళ్లి చేసుకొని అత‌నితో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక విడాకులు తీసుకుంది. కొద్ది రోజుల‌కి క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకోగా, వారిద్ద‌రి వైవాహిక బంధంలో ఓ పాప జ‌న్మించింది. అయితే కొద్ది రోజుల నుండి శ్రీజ అత‌నితో దూరంగా ఉంటుంద‌ని, విడాకులు కూడా తీసుకుందని చెప్పుకొస్తున్నారు. మ‌రోవైపు నిహారిక విడాకుల అంశం కూడా […]

  • Publish Date - July 5, 2023 / 02:16 AM IST

Pawan Kalyan: గ‌త కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ విడాకుల అంశంతో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఒక వ్య‌క్తిని పెళ్లి చేసుకొని అత‌నితో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక విడాకులు తీసుకుంది. కొద్ది రోజుల‌కి క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకోగా, వారిద్ద‌రి వైవాహిక బంధంలో ఓ పాప జ‌న్మించింది. అయితే కొద్ది రోజుల నుండి శ్రీజ అత‌నితో దూరంగా ఉంటుంద‌ని, విడాకులు కూడా తీసుకుందని చెప్పుకొస్తున్నారు. మ‌రోవైపు నిహారిక విడాకుల అంశం కూడా తెగ ట్రెండింగ్‌లో నిలిచింది. 2020లో జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ని వివాహం చేసుకున్న నిహారిక అత‌నికి డైవ‌ర్స్ ఇచ్చింద‌ని కొన్నాళ్లుగా జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఎట్ట‌కేల‌కి జూలై 4న దీనిపై క్లారిటీ వ‌చ్చింది.

హిందూ చట్ట ప్రకారం నిహారిక‌ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు గత నెల 5న వారికి విడాకులు మంజూరు చేసింది.ఈ ద‌రఖాస్తు నెట్టింట వైర‌ల్ కావ‌డంతో నిహారిక‌- చైత‌న్య విడాకుల విష‌యం నిజ‌మేన‌ని అంద‌రు భావిస్తున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మూడో భార్య‌తో విడాకులు తీసుకోబోతున్నాడ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. కొన్నాళ్లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న భార్య‌కి దూరంగా ఉంటూ వ‌స్తున్నార‌ని తెలుస్తుంది. ఇటీవ‌ల ప‌వ‌న్ త‌న భార్య‌తో ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆమెతో కూడా విడాకులు తీసుకోబోతున్నార‌ని మెగా యాంటీ ఫ్యాన్స్ ప్ర‌చారాలు చేస్తున్నారు.

అందుకు సాక్ష్యంగా ఇటీవ‌ల వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థం చెబుతున్నారు. ఈ వేడుక‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోలోగా రావ‌డంతో త‌న మూడో భార్య నుండి కొద్ది రోజులుగా ప‌వ‌న్ దూరంగా ఉంటున్నాడ‌ని చెప్పుకొస్తున్నారు. చాలా రోజుల క్రిత‌మే అన్నా లెజినోవా త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ర‌ష్యా వెళ్లిపోయింద‌ని, ఇక త‌ను రాద‌ని చెప్పుకొస్తున్నారు. కాగా, నందిని,, రేణూదేశాయ్‌ల నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత ప‌వన్ క‌ళ్యాణ్ 2013లో అన్నాలెజినోవాని వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కి కూతురు పొలెనా అంజనా పవనోవా, కుమారుడుకి మార్క్ శంకర్‌ పవనోవిచ్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

Latest News