బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాలో పుట్టించే ప్రకంపనలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ అయింది. కాని ఈ మధ్య మాత్రం పూజా హెగ్డేకి ఒక్క మంచి విజయం కూడా దక్కడం లేదు.
తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పొడుగు కాళ్ల సుందరి తొలి సినిమాలోనే తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక రెండో సినిమా ముకుంద చిత్రం చేయగా, ఇందులో కూడా తన గ్లామర్ ఒలకబోసి కుర్రాళ్ల మనసులు దోచుకుంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో బుట్ట బొమ్మగా చెరగని ముద్ర వేసుకున్న పూజా హెగ్డే ఇప్పుడు తన క్యూట్ అండ్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ భామ మాల్దీవుల్లో సందడి చేస్తుంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం మాల్దీవులకి వెళ్లిన ఈ అందాల ముద్దుగుమ్మ అక్కడ బికినీలో దర్శనమిచ్చి హీటెక్కించింది.
బికినీలో పూజా హెగ్డేని చూసిన నెటిజన్స్ అక్కడ అంతలా మంటపెడుతున్నావేంది పూజా అని కామెంట్స్ చేస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఎద అందాలు, బ్యాక్ సొగసుతో పూజా హెగ్డే ఇస్తున్న హావభావాలు చూసి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. ఆమె బికినీ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
పూజా హెగ్డే చివరిగా తెలుగులో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించగా, ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. ఇక తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టు కోవడంతో ఈ అమ్మడికి సౌత్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు.వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న ఈ బ్యూటీకి తొలగింపులు కూడా పెద్ద సమస్యగా మారాయి.
గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాల దర్శక నిర్మాతలు పూజను పక్కన పెట్టి వేరే హీరోయిన్లను తీసుకున్నారన్న టాక్ ఉంది. ఇక అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఓ సినిమా ప్రకటించగా, ఇందులో పూజాను తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అయితే క్లారిటీ లేదు.