PUNE | భార్య‌, పిల్ల‌ల‌ను చంపి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప‌శువుల డాక్ట‌ర్

PUNE | ఓ ప‌శువుల డాక్ట‌ర్ దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పుణె జిల్లాలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. పుణె జిల్లాలోని వ‌ర్వంద్ ఏరియాకు చెందిన అతుల్ దివేక‌ర్(42) వృత్తి రీత్యా ప‌శువుల డాక్ట‌ర్. ఆయ‌న‌కు భార్య ప‌ల్ల‌వి దివేక‌ర్(39), అద్వైత్(9), వేదాంతి(6) అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే మంగ‌ళ‌వారం త‌న భార్య గొంతు నులిమి చంపాడు. ఆ త‌ర్వాత […]

  • Publish Date - June 21, 2023 / 12:27 PM IST

PUNE | ఓ ప‌శువుల డాక్ట‌ర్ దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పుణె జిల్లాలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. పుణె జిల్లాలోని వ‌ర్వంద్ ఏరియాకు చెందిన అతుల్ దివేక‌ర్(42) వృత్తి రీత్యా ప‌శువుల డాక్ట‌ర్. ఆయ‌న‌కు భార్య ప‌ల్ల‌వి దివేక‌ర్(39), అద్వైత్(9), వేదాంతి(6) అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

అయితే మంగ‌ళ‌వారం త‌న భార్య గొంతు నులిమి చంపాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు పిల్ల‌ల‌ను త‌న ఇంటికి స‌మీపంలో ఉన్న బావిలో తోసేశాడు. అనంత‌రం తాను ఇంట్లోనే ఉరేసుకున్నాడు ప‌శువుల డాక్ట‌ర్.

అతుల్ దివేక‌ర్ మృత‌దేహం వ‌ద్ద సూసైడ్ నోట్ ల‌భ్య‌మైంది. త‌న భార్య వేధింపులు భ‌రించ‌లేక‌నే ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు అతుల్ పేర్కొన్నాడు.

మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Latest News