Valigonda | తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం విధాత: రైతులకు, వ్యాపారులకు మధ్య సమన్వయకర్తగా మార్కెట్ కమిటీ చైర్మన్ పైళ్ల రాజవర్ధన్ రెడ్డి సమర్ధవంతంగా పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం వలిగొండ మండల కేంద్రంలోని డీపీఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పైళ్ల రాజవర్ధన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పైళ్ల రాజవర్ధన్ రెడ్డి 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో […]
Valigonda |
తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం
విధాత: రైతులకు, వ్యాపారులకు మధ్య సమన్వయకర్తగా మార్కెట్ కమిటీ చైర్మన్ పైళ్ల రాజవర్ధన్ రెడ్డి సమర్ధవంతంగా పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం వలిగొండ మండల కేంద్రంలోని డీపీఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పైళ్ల రాజవర్ధన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
పైళ్ల రాజవర్ధన్ రెడ్డి 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు పని చేశారని, 23 ఏళ్ల నిరీక్షణ ఓపికకు మార్కెట్ చైర్మన్ పదవి లభించిందని, ఇది ఆయనకు చిన్న పదవేయైన పదవికి వన్నె తెస్తారన్నారు. భవిష్యత్తులో రాజవర్ధన్ రెడ్డికి మరిన్ని మంచి పదవులు రావాలని కోరుకునే వ్యక్తులలో తాను మొదటి వ్యక్తినన్నారు. రాజవర్ధన్ రెడ్డికి రైతులకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టమని, రాజకీయాల్లో చిన్న పెద్ద అని ఉండదన్నారు.
భారతదేశ వ్యవసాయ రంగానికి ఇవ్వాళ తెలంగాణ దిక్సూచి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీతో రైతాంగ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. కాళేశ్వరంతో ఈ ప్రాంతా రైతాంగానికి కూడా నీరందుతుందని, మూసీ కాల్వలను విస్తరించామన్నారు. భువనగిరి నియోజకవర్గంలో పైళ్ల శేఖర్ రెడ్డిని, నకిరేకల్ నియోజకవర్గం నుండి చిరుమర్తి లింగయ్యని ప్రజలు మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకొస్తే రైతులకు మూడు గంటల కరెంటు, 400 పెన్షన్ మాత్రమే అందిస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతకుముందు వలిగొండ మండల కేంద్రంలో బీఆరెస్ భారీ ర్యాలీలో జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు.
మంత్రి వెంట అయిల్ ఫెడ్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ కమ్మంపాటి శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్లుగా కాసుల మధుసూదన్ గౌడ్, కందుల శ్రీను, వడిచర్ల మల్లేష్, మర్రి వెంకటేశం, బండ ఉపేందర్ రెడ్డి, బొడ్డు మల్లయ్య, పున్న వెంకటేశం, క్యాస వీరస్వామి, నర్రా నరసింహ, గోరంటి రమేష్, తవుటం నరహరి, బీఆరెస్ మండల, పట్టణ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, ఎమ్మె లింగస్వామి, ఎంపీపీ నూతి రమేష్, మాజీ జడ్పీటీసీ మొగుళ్ళ శ్రీనివాస్, నాయకులు సురగంటి వెంకటరెడ్డి, చెరుకు శివయ్య, కోనపురి కవిత, పనుమటి మమత, కొమురెల్లి సంజీవరెడ్డి, గూడూరు శివశాంత్ రెడ్డి, మొగిలిపాక నరసింహ, మాద శంకర్ గౌడ్, బత్తిని సహదేవ్, కాసుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.