Ramayampeta | నేటితో దీక్షలకు 100 వరోజు రామాయంపేటలో వినూత్న నిరసన జేఏసీ అధ్వర్యంలో బిక్షాటన విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలోని ఒకప్పటి రామాయంపేట నియోజకవర్గ కేంద్రం, రామాయంపేట పట్టణంను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 100వ రోజుకు చేరుకున్నాయి. BRS పార్టీ మినహా అన్ని ప్రతి పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార వాణిజ్య వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. రోజు,రోజుకు, రెవెన్యూ […]
Ramayampeta |
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలోని ఒకప్పటి రామాయంపేట నియోజకవర్గ కేంద్రం, రామాయంపేట పట్టణంను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 100వ రోజుకు చేరుకున్నాయి.
BRS పార్టీ మినహా అన్ని ప్రతి పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార వాణిజ్య వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. రోజు,రోజుకు, రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమం ఉదృతమవుతుంది. నేటితో దీక్షలకు 100 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. 100 రోజులు గడుస్తున్న ప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించ లేనందుకు భిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
రామాయంపేట పట్టణ పురవీధుల గుండా వ్యాపార వాణిజ్య సంస్థలలో జేఏసీ నాయకులు అందరూ వెళ్లి భిక్షాటన చేపట్టారు , ఇప్పటికైనా స్థానిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో త్వరలో జరగబోయే మెదక్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభను రామాయంపేట నుంచి వేలాది మందిగా తరలివచ్చి వారి సభలో రామయంపేట రెవెన్యూ డివిజన్ గురించి నిలదీస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దోమకొండ యాదగిరి, పోచమ్మల అశ్విని, చింతల శేఖర్, వెలుముల రమేష్ , వినయ్ సాగర్, రెడ్డమైన నరేష్ , బొట్ల బాబు, కౌన్సిలర్లు అనిల్, చింతల యాదగిరి మరికొందరు జేసి నాయకులు పాల్గొన్నారు.