Rashmi Gautam | రష్మీని ‘రాత్రికి వస్తావా..’ అని అడిగేశాడు.. ఇంద్రజ షాక్‌!

Rashmi Gautam | బుల్లితెరను ఓ ఊపు ఊపేసిన, ఊపేస్తున్న కామిడీ షో ‘జబర్దస్త్’. ఈ షో గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి ఉండదేమో. ఈ షో‌ ద్వారా గుర్తింపు పొందిన ఎందరో.. సినీ కెరియర్ పరంగా ఆర్టిస్ట్‌లు, యాంకర్లు, కమెడియన్స్‌గా స్థిరపడ్డారు. ఇక రష్మీ, అనసూయలు సినిమాల్లో హీరోయిన్‌గా ఒకరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరొకరు స్థిరపడ్డారు. ఇందులో అనసూయ ఎప్పుడో జబర్దస్త్ షోను వదలి సినిమా ఇండస్ట్రీలోనే పాగా వేస్తే.. రష్మీ మాత్రం తనకు జీవితాన్నిచ్చిన బుల్లితెరను […]

  • Publish Date - July 27, 2023 / 05:58 AM IST

Rashmi Gautam |

బుల్లితెరను ఓ ఊపు ఊపేసిన, ఊపేస్తున్న కామిడీ షో ‘జబర్దస్త్’. ఈ షో గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి ఉండదేమో. ఈ షో‌ ద్వారా గుర్తింపు పొందిన ఎందరో.. సినీ కెరియర్ పరంగా ఆర్టిస్ట్‌లు, యాంకర్లు, కమెడియన్స్‌గా స్థిరపడ్డారు. ఇక రష్మీ, అనసూయలు సినిమాల్లో హీరోయిన్‌గా ఒకరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరొకరు స్థిరపడ్డారు. ఇందులో అనసూయ ఎప్పుడో జబర్దస్త్ షోను వదలి సినిమా ఇండస్ట్రీలోనే పాగా వేస్తే.. రష్మీ మాత్రం తనకు జీవితాన్నిచ్చిన బుల్లితెరను వదిలేయకుండా ఇంకా టీవీ షోలు చేస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా రాణిస్తుంది.

‘జబర్దస్త్’ మాత్రమే కాకుండా.. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి కూడా రష్మీ పని చేస్తుంది.. దీనికి కూడా మంచి పేరే వచ్చింది. మామూలుగా కామెడీ షో అనగానే డబుల్ మీనింగ్ డైలాగులతోనే నడిపిస్తుంటారు. ఈ మధ్యకాలంలో అలాంటి షోలు ఎక్కువైపోయాయి. ఇలా అయితేనే షోలు సక్సెస్ అవుతాయనే ధోరణి కూడా పెరిగిపోయింది మేకర్స్ దృష్టిలో.

అయితే ఇదే తోవలో ఈమధ్య రష్మీకి చేదు అనుభవం ఎదురైందట. హైపర్ ఆది స్క్రిట్ అంటే మొత్తంగా ఊకదంపుడు డబుల్ మీనింగ్ డైలాగులు, వెకిలి చేష్టలే ఉంటాయి. ఇప్పుడు అదే కోవలో రాం ప్రసాద్ కూడా తయారయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఓ స్క్రిట్ చేస్తూ రాంప్రసాద్ రష్మీని ‘రాత్రికి వస్తావా’ అనే అర్థం వచ్చేలా డైలాగ్ వేయడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

వెంటనే రష్మీ ఎందుకు రావాలని అడిగితే.. రాత్రికి ఎందుకు రమ్మంటారో తెలీదా అని సమాధానం ఇచ్చాడు. సెట్‌లో ఉన్నవారంతా రాం ప్రసాద్ ఏం మాట్లాడుతున్నాడని షాక్‌తో చూస్తుంటే.. ఇంద్రజ రియాక్ట్ అయ్యి ‘ఏయ్’ అనేసరికి తేరుకుని ఏదో కవర్ చేశాడు రాంప్రసాద్. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైన వైరల్ అవుతోంది.

మామూలుగా ఇలాంటి షోలన్నింటిలో ఆటో పంచులతో, ఆడవారిని తక్కువ చేస్తూ వేసే నాసిరకం కామెడీనే ఉంటుంది. ఇప్పుడు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కూడా అలానే తయారయిందనే ఆరోపణలు Iన్నాయి. కంటెంట్ పరంగా చాలా వీక్‌గా ఉన్నా ఈ షోను తిట్టేవారు, చూసేవారూ ఇద్దరూ ఉండటంతో రేటింగ్ పరంగా హైలో ఉండటంతో యూనిట్ వెనకడుగు వేయడం లేదు.

ఇక ప్రముఖ ఛానల్‌ అయిన ఈటీవీలో ప్రసారం కావడం కూడా ఈ షోకు ఫ్లస్ అయింది. అయితే రేటింగ్ పిచ్చిలో పడి ఉన్నపేరును ఆ ఛానల్ పోగొట్టుకుంటుందనే కామెంట్స్ కూడా బాగానే వినిపిస్తున్నాయి.

Latest News