Komatireddy |
విధాత: తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ల ఐక్యత పైకి కనిపించేంత సఖ్యతగా లేదని మరోసారి వెల్లడైంది. ఖమ్మం తెలంగాణ జన గర్జన సభకు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం తెలుపుతూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ట్విట్లో రేవంత్ రెడ్డి ఫోటో కానరాకపోవడం చర్చనీయాంశమైంది.
తన పోటో, రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క, పార్టీలో చేరుతున్న పొంగులేటి, జూపల్లిల ఫోటోలతో కూడిన ట్విట్ను కోమటిరెడ్డి పోస్ట్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ నేతలు పాడుతున్న ఏకతా రాగంలో శృతి లోపించిందని.. వారి మధ్య ఐక్యత ఒట్టి మాటేనా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార బీఆర్ఎస్ పార్టీని మరింత సంఘటితంగా ఢీ కొనాల్సిన కాంగ్రెస్ నేతలు తరచూ తమ మధ్య అనైక్యతను బహిర్గతం చేసుకోవడం క్యాడర్ను అసహనానికి గురి చేస్తుంది.
ఛలో ఖమ్మం
తెలంగాణ ప్రజల బానిస సంకెళ్లు తెంచడానికి..
అక్రమాల సర్కార్ ను కూకటివేళ్ళతో పెకలించడానికి…
మార్గనిర్దేశం చేసేందుకు వస్తున్నారు మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు…
కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు.. రండి.. తరలిరండి…
ఖమ్మం గుమ్మంలో గర్జిద్దాం… pic.twitter.com/3LaCGukohn— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) July 1, 2023