ఉద్యోగుల సమష్టి కృషితోనే సంస్థకు గుర్తింపు ప్రభుత్వ ప్రోద్బలంతో హెచ్ఎండిఏ ముందడుగు పంద్రాగస్టు పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య Chandraya | విధాత ప్రతినిధి, హైద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో, మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) పాత్ర ఎంతో కీలకంగా ఉందని సెక్రెటరీ పి.చంద్రయ్య (Chandraya ) అన్నారు. మంగళవారం అమీర్ పేట్ ప్రధాన కార్యాలయంలో హెచ్ఎండిఏ ఉన్నతాధికారులతో కలిసి సెక్రటరీ చంద్రయ్య జాతీయ […]
Chandraya | విధాత ప్రతినిధి, హైద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో, మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) పాత్ర ఎంతో కీలకంగా ఉందని సెక్రెటరీ పి.చంద్రయ్య (Chandraya ) అన్నారు. మంగళవారం అమీర్ పేట్ ప్రధాన కార్యాలయంలో హెచ్ఎండిఏ ఉన్నతాధికారులతో కలిసి సెక్రటరీ చంద్రయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన హెచ్ఎండిఏ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా సంస్థకు ఎంతో గుర్తింపు వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దూరదృష్టి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) కార్యదక్షత, ఎంఏయుడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్ పర్యవేక్షణలో హెచ్ఎండిఏ ఉద్యోగులు ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తున్నారు.
గత మూడున్నర సంవత్సరాల కాలంలో హెచ్ఎండిఏ చేపట్టిన పనులతో వచ్చిన అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు ఆందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ (సీఈఓ) విజయలక్ష్మి, అర్బన్ ఫారెస్ట్ ఇన్ ఛార్జ్ డైరెక్టర్ సోమేశ్వర్ రావు, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్, సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఇ) పరంజ్యోతి, ల్యాండ్ ఏక్విజేషన్ ఆఫీసర్ (ఎల్ఏఓ)ప్రసూనాంబ, ఓఎస్డి రాంకిషన్ మాట్లాడారు. హెచ్ఎండిఏ అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
హెచ్.జీ.సీ.ఎల్ లో ఎండీ పతాక ఆవిష్కరణ
నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్.జీ.సీ.ఎల్) ఆవరణలో మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి), హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీజిఎంలు మాజీద్ షరీఫ్, రవీందర్, డీజీఎంలు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు