విధాత: గబ్బర్ సింగ్ ముందు వరకు కమలహాసన్ గారాల పట్టి శృతిహాసన్పై ఐరన్ లెగ్ ముద్ర ఉండేది. కానీ ఒక్కసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్తో ఆమె పూర్తిగా స్వింగ్లోకి వచ్చింది. ఆ తర్వాత పవన్ తోనే కలిసి కాటమరాయుడు అనే చిత్రంలో నటించింది.
గబ్బర్ సింగ్ స్థాయిలో విజయం సాధించకపోయినా కాటమరాయుడు కూడా విజయవంతమైన చిత్రంగానే పేరు తెచ్చుకుంది. ఇక రాంచరణ్ తో ఎవడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఇక అల్లు అర్జున్తో రేసుగుర్రంలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది.
ప్రస్తుతం శృతిహాసన్ మెగాస్టార్ చిరంజీవితో నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. అంతేకాదు ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో చిందులేసిన ఆమె మరోవైపు బాలయ్యతో కలిసి వీరసింహారెడ్డి లో ఆడి పాడింది. ఈ రెండు చిత్రాలు ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రాల్లో ఆమె నిడివి మాత్రం ఏ మాత్రం చెప్పుకో దగ్గట్టుగా లేదు. ఏదో పాటలకు తప్ప ఈమె పాత్రలకు ప్రాధాన్యం అనేది లేదు. వీరసింహారెడ్డిలో ఈమె కంటే హనీ రోజ్ పరిస్థితి బాగుంది. వీరందరికంటే వరలక్ష్మి శరత్ కుమార్కు వచ్చిన పేరే ఎక్కువ కనిపించింది.
వాల్తేరు వీరయ్యలో రా ఏజెంట్గా కనిపించినప్పటికీ ఈ పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదు. అయినా సినిమాలోని తన పాత్రలను చూడకుండా ఈమె స్టార్ హీరోలకు మాత్రం ఉదారంగా కాల్షిట్టు ఇస్తోంది. తద్వారా స్టార్ హీరోలతో నటించి చిత్రాలు విజయవంతం అయితే ఆ సినిమాల సక్సెస్ క్రెడిట్లో తాను భాగం కావాలని కోరుకుంటుంది.
పాత్ర ఎంత ఏమిటనేది చూసుకోకుండా స్టార్ హీరో అయితే ఓకే అనేస్తోంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తోంది. తద్వారా యంగ్ స్టార్ హీరో సరసన కూడా తాను హీరోయిన్గా నటించాలని ఆశిస్తోంది. సలార్ మూవీ హిట్ అయితే ఈమెకు యంగ్ హీరోల సరసన కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి శృతిహాసన్ మెగా కాంపౌండ్కు గోల్డెన్ లెగ్గుగా మారిందని చెప్పాలి.