TSPSC: పేపర్ లీక్ కేసు.. మరో 42 మందికి సిట్ నోటీసులు

విధాత: TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ తాజాగా మరో 42 మందికి నోటీసులు జారీ చేసింది. TSPSCలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న 42 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. త్వరలోనే వారిని విచారించనుంది. అలాగే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఉద్యోగి శంకర్ లక్ష్మి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలతో సన్నిహితంగా ఉండే వారిని గుర్తించి వారిని విచారించేందుకు సిట్ ప్రయత్నిస్తుంది. రేణుకకు టచ్‌లో ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులను, […]

  • Publish Date - March 22, 2023 / 09:18 AM IST

విధాత: TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ తాజాగా మరో 42 మందికి నోటీసులు జారీ చేసింది. TSPSCలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న 42 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది.

త్వరలోనే వారిని విచారించనుంది. అలాగే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఉద్యోగి శంకర్ లక్ష్మి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు.

ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలతో సన్నిహితంగా ఉండే వారిని గుర్తించి వారిని విచారించేందుకు సిట్ ప్రయత్నిస్తుంది.

రేణుకకు టచ్‌లో ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులను, అభ్యర్థులను కూడా సిట్ విచారించనున్నట్లుగా తెలుస్తుంది.

Latest News