విధాత‌: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఒక వైపు జ‌రుగుతుండ‌గా, మ‌రో వైపు కర్ణాట‌క బీజేపీ కార్యాల‌యంలో పాము క‌ల‌క‌లం సృష్టించింది. సిగ్గావ్‌లోని బీజేపీ కార్యాల‌యంలో శ‌నివారం 11 గంట‌ల ప్రాంతంలో పాము ప్ర‌త్య‌క్ష‌మైంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆఫీస్‌ ప్రాంగణం వద్దకు రాగానే పాము కనిపించింది.

పాము జ‌ర‌జ‌ర పాకుతూ ముందుకు కద‌ల‌డంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. అయితే, సిబ్బంది పాము ప‌ట్టుకున్నారు. ఓట్ల లెక్కింపు చుట్టూ ఉన్న ఉద్రిక్త వాతావరణం నుంచి నాయ‌కుల దృష్టిని పాము మ‌ళ్లించింది. ఎన్నికల ప్రక్రియకు అసాధారణమైన ట్విస్ట్ జోడించింది.