విధాత: కోర్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు జాబ్కు కావాల్సిన అన్ని అర్హతలు ఉంటే వారిని క్రమబద్ధీకరించాలని రిజిస్ట్రార్ జనరల్ను హైకోర్టు (High Court) ఆదేశించింది. కొందరు పది పదిహేనేళ్లుగా పని చేస్తున్నారని, వారి సేవలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. కోర్టుల్లో ఖాలీలు ఉన్న పోస్టుల్లో వీరితో నియామకం చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నవారిని తొలగిస్తూ 2021, […]
విధాత: కోర్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు జాబ్కు కావాల్సిన అన్ని అర్హతలు ఉంటే వారిని క్రమబద్ధీకరించాలని రిజిస్ట్రార్ జనరల్ను హైకోర్టు (High Court) ఆదేశించింది. కొందరు పది పదిహేనేళ్లుగా పని చేస్తున్నారని, వారి సేవలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. కోర్టుల్లో ఖాలీలు ఉన్న పోస్టుల్లో వీరితో నియామకం చేపట్టాలని పేర్కొంది.
ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నవారిని తొలగిస్తూ 2021, ఏప్రిల్ 1న రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని సవాల్ చేస్తూ 200 మంది వరకు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ నవీన్రావు, జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. నిర్ణీత జాబ్కు అర్హతలున్న కాంట్రాక్ట్ క్లర్క్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.