Site icon vidhaatha

Hyderabad | నకిలీ వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

Hyderabad | విధాత : హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు ఇవాళ ఉదయం పోలీసులు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న గోడౌన్ పై దాడి చేశారు. ఈ పేస్ట్ తయారు చేస్తున్న వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ఎస్ఓటీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version