టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి కుమారుడు మృతి

TTD EO Dharma Reddy | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో ధ‌ర్మారెడ్డి కుమారుడు చంద్ర‌మౌళి(28) ఆదివారం మ‌ధ్యాహ్నం గుండెపోటుకు గురైన విష‌యం విదిత‌మే. చెన్నైలోని కావేరి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ చంద్ర‌మౌళి క‌న్నుమూశారు. ఈ విషయాన్ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు అధికారికంగా ప్ర‌క‌టించాయి. ఎక్మో స‌హా ఇత‌ర చికిత్స‌లు అందించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. చంద్ర‌మౌళి మృతితో ఆ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. వ‌చ్చే నెల‌లో పెళ్లి.. చంద్ర‌మౌళి వివాహం వ‌చ్చే జ‌న‌వ‌రిలో తిరుమ‌ల‌లో చేయాల‌ని కుటుంబ […]

  • Publish Date - December 21, 2022 / 05:54 AM IST

TTD EO Dharma Reddy | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో ధ‌ర్మారెడ్డి కుమారుడు చంద్ర‌మౌళి(28) ఆదివారం మ‌ధ్యాహ్నం గుండెపోటుకు గురైన విష‌యం విదిత‌మే. చెన్నైలోని కావేరి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ చంద్ర‌మౌళి క‌న్నుమూశారు. ఈ విషయాన్ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు అధికారికంగా ప్ర‌క‌టించాయి. ఎక్మో స‌హా ఇత‌ర చికిత్స‌లు అందించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. చంద్ర‌మౌళి మృతితో ఆ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

వ‌చ్చే నెల‌లో పెళ్లి..

చంద్ర‌మౌళి వివాహం వ‌చ్చే జ‌న‌వ‌రిలో తిరుమ‌ల‌లో చేయాల‌ని కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో పెళ్లి ప‌త్రిక‌ల‌ను పంచ‌డంలో ఆయ‌న కుటుంబ స‌భ్యులు బిజీగా ఉన్నారు. ఆదివారం నాడు చంద్ర‌మౌళి.. చెన్నైలోని అళ్వారుపేట‌లో ఉంటున్న త‌మ బంధువుల‌కు పెళ్లి ప‌త్రిక ఇచ్చి, ఆహ్వానించేందుకు వెళ్లాడు. ఇంట్లో కూర్చున్న కాసేప‌టికే గుండెలో నొప్పిగా ఉన్న‌ట్లు స్నేహితుడికి తెలిపాడు చంద్ర‌మౌళి. దీంతో హుటాహుటిన స‌మీపంలోని కావేరీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందించారు.

జూన్‌లో నిశ్చితార్థం..

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి, ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి కుమార్తె భాగ్యశ్రీ నిశ్చితార్థం ఈ ఏడాది జూన్ 9వ తేదీన తిరుమలలో జ‌రిగింది. స్థానిక చిన్నజీయర్‌ మఠంలో పరిమిత కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థ కార్య‌క్ర‌మం జరిగింది.

Latest News