Medak, Balagam| కంటతడి పెడుతున్న పల్లెలు.. గ్రామాల్లో ‘బలగం’ ప్రదర్శనలు
నాటి సీన్ నేడు రీపిట్ పల్లె బంధాలను గుర్తు చేస్తున్న బలగం పల్లె ప్రజలను కన్నీరు పెట్టుస్తుంది గ్రామ ప్రధాన కూడలిలో ఒకే వద్ద చేరుకొని ముచ్చట నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న గ్రామీణులు మెదక్ ఉమ్మడి జిల్లాలో పల్లె పల్లేన బలగం సినిమా ప్రదర్శన విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెగిపోయి బంధాలను దూరమైన అనుబంధాలను గుర్తుచేస్తోంది. కళ్లు చెమర్చేలా ప్రతీ ఒక్కరితో కనెక్ట్ అవుతోంది. కదిలిస్తోంది.. అనుబంధాలను దగ్గరకు తెస్తోంది. ఇంట్లో ఎవరైనా చనిపోయనప్పుడు […]

- నాటి సీన్ నేడు రీపిట్
- పల్లె బంధాలను గుర్తు చేస్తున్న బలగం
- పల్లె ప్రజలను కన్నీరు పెట్టుస్తుంది
- గ్రామ ప్రధాన కూడలిలో ఒకే వద్ద చేరుకొని ముచ్చట
- నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న గ్రామీణులు
- మెదక్ ఉమ్మడి జిల్లాలో పల్లె పల్లేన బలగం సినిమా ప్రదర్శన
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెగిపోయి బంధాలను దూరమైన అనుబంధాలను గుర్తుచేస్తోంది. కళ్లు చెమర్చేలా ప్రతీ ఒక్కరితో కనెక్ట్ అవుతోంది. కదిలిస్తోంది.. అనుబంధాలను దగ్గరకు తెస్తోంది. ఇంట్లో ఎవరైనా చనిపోయనప్పుడు 11 రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్నే కథగా మలిచి తెరపై అందరి జీవితాన్ని బలగం సినిమాగా విష్కరించారు. పల్లెల్లో చూసిన ప్రతీ ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది.
చావు లేని ఇల్లు ఉండదు.. ఆ సమయంలో నిర్వహించే కార్యక్రమాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. అయితే గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కని మదిలో ఏదో ఒక మూలన ఈ అంశం దాగి ఉంది. దానినే తట్టిలేపింది ‘బలగం’ సినిమాలోని క్లైమాక్స్ పాట… కుటుంబ సంబంధాల్లో అడుగంటిపోతున్న ప్రేమానురాగాల్ని సున్నితంగా స్పృశించింది. తోబుట్టువుల మధ్య ముళ్లకంచెలా మారిన అహాన్ని… పటా పంచెలు చేసింది. సినిమా చూస్తున్నంత సేపు పల్లె కళ్లముందు కదలాడుతోంది.
కంటతడి పెడుతున్న పల్లెలు..
ప్రేక్షకులకు నచ్చాలి గానీ, చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఓన్ చేసేసుకుంటారు. ఇది ఇంతకూ మునుపు చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇటీవలి కాలంలో నేటివిటీకి, రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఆమధ్య వచ్చిన జైభీం, కాంతార, పుష్ప, అప్పట్లో వచ్చిన మాతృదేవోభవ.. లాంటి సినిమాలు ప్రేక్షకులకు నచ్చాయి, హృదయాలను తాకాయి.
ఆ సినిమాల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకున్నారు. తాజాగా కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చి తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న బలగం సినిమా విషయంలో మరోసారి సినిమా హిట్ అవ్వాలంటే బడ్జెట్తో సంబంధం లేదని ప్రూవ్ అయ్యింది. మరిచిపోతున్న మన సంప్రదాయాన్ని బలగం గుర్తు చేసింది అంటూ ప్రతీ పల్లెలను సైతం కన్నీరు పెట్టిస్తోంది.
కథ అని తెలిసినా..
సినిమా అంటేనే కథ.. కల్పితం ఆధారంగా తీసినదే. ఆమధ్య వచ్చిన గోరింటాకు సినిమాకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఇటీవల వచ్చిన జైభీం కూడా రియల్ స్టోరీ. అది కూడా అందరినీ కదిలించింది. బలగం కూడా ఓ సామాన్య కుటుంబంలో ఎవరైనా చనిపోయన తర్వాత 11 రోజుల కార్యక్రమాల కథ. అందులో దూరమైన అనుబంధాలు ఎలా కలిశాయి.. ఎలా దూరమయ్యాయి.. దూరమైతే చనిపోయిన వారి ఆత్మ ఎలా ఘోషిస్తుంది అనేది బలంగం కళ్లకు కట్టింది. ఈ సినిమా కూడా స్టోరీ అని తెలిసినా గ్రామీణ నేపథ్యం ఉన్న అందరి హృదయాలకు తాకుతూనే ఉంది.
విశేషం ఏంటంటే, ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫాంలో స్ట్రీమ్ అవుతున్నా కూడా జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. దీంతో మంచి కథకు ఉన్న పవర్ ఏంటో తెలుస్తోంది. కథలో ఒరిజినాలిటీ ఉండటమే బలగం సినిమాకు ప్రధాన బలం. దీనికి తోడు ఇందులో నటించిన వారిలో చాలా మంది కొత్త వారైనప్పటికీ ఆ పాత్రలలో చక్కగా ఇమిడిపోవటం సినిమా అందరికీ కనెక్ట్ కావడానికి మరో కారణం. పల్లె అందాలను, తెలంగాణ సంప్రదాయాలను, మనుషుల భావోద్వేగాలను బలగం సినిమాల కళ్లకు కట్టింది. అందుకే ప్రతి ఒక్కరూ ఆ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు.
నాటి సీన్ నేడు రిపీట్..
పాత లవకుశ, ఒసేయ్ రాములమ్మ, పుట్టింటికిరా చెల్లి లాంటి సినిమాలకు జనాలు బండ్లు కట్టుకొని మరీ వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు బలగం సినిమాకు కూడా అలంటి సీనే రిపీట్ అవుతోంది. చాలా పల్లెల్లో ఊరి జనాలంతా కలిసి ఒకే చోట ప్రొజెక్టర్ స్క్రీన్ మీద ఈ సినిమాని చూస్తున్నారు. మరో చోట పల్లె జనాలు ఆ ఊరి సర్పంచ్పై ఒత్తిడి తెచ్చి మరీ ఈ సినిమా స్క్రీనింగ్ వేయించుకున్నారట. ఒక్క సంఘటన చాలు ఈ సినిమా జనాల హృదయాల్లోకి ఎంతలా వెళ్లిందో చెప్పటానికి మాటలు చాలాడం లేదు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో.. లీడర్ల మధ్య పోటీ
బలగం సినిమాని గ్రామాలలో ప్రదర్శించడం లో పోటీ పడుతున్నారు.సిద్దిపేట,మెదక్,సంగారెడ్డి జిల్లా లలో బలగం సినిమాని ప్రొజెక్టర్ ద్వారా గ్రామాల కూడళ్లలో ప్రదర్శిస్తున్నారు.అయా గ్రామాలలో స్వచ్ఛందంగా యువజన సంఘాలు,ఆయా రాజకీయ పార్టీల నేతలు ఉచితంగా ప్రజలకు చూపిస్తున్నారు.
ప్రతి రోజు 10..12 వేలు సంపాదిస్తున్నం
ప్రతి రోజు అడర్లు ఉన్న గ్రామాలలో తాము ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ ను ఏర్పాటు చేస్తూ బలగం సినిమాని గ్రామాలలో ప్రదర్శించడం ద్వారా 10 నుంచి 12 వేల వరకు సంపాదిస్తున్నాని మెదక్ జిల్లా ఫోటో గ్రాఫర్ ,వీడియో గ్రాఫర్ల మెదక్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ప్రభుగౌడ్ తెలిపారు. ఇప్పటికే 40 నుంచి 45 గ్రామాలలో బలగం సినిమాని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించామని తెలిపారు. – ప్రభుగౌడ్, ఏల్లాపూర్, మెదక్ జిల్లా ఫోటో ,వీడియో గ్రాఫర్ల సంఘం అసోసియట్ అధ్యక్షుడు