Warangal రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహిళాభివృద్ధితో సమాజ పురోగతి సాధిస్తుందనే గట్టి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి […]
Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహిళాభివృద్ధితో సమాజ పురోగతి సాధిస్తుందనే గట్టి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం లో అమలవుతున్న, శాశ్వతంగా గుర్తుండి పోయే పథకాలు తెలంగాణ ఆచరిస్తుంటె దేశం అనుకరిస్తుందన్న మాట వాస్తవ మని అన్నారు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా వీ-హబ్, మహిళా,శిశు సంక్షేమానికి సంబంధించి దేశంలోనే విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వమన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు జరిగాయని చెప్పారు. కేసీఆర్ కిట్ ద 13,90,636 మంది లబ్ధిదారులకందించినట్లు, న్యూట్రిషన్ కిట్లు 6.84 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు లబ్ధి చేకూరిందని, అమ్మఒడి పథకం ద్వారా 18,46,635 మందికి లబ్ధి చేకూరిందని వివరించారు. అన్ని రంగాల్లో మహిళాలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత మన కెసిఆర్ కు దక్కుతుంది అన్నారు.
గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చామన్నారు. గర్భిణీ స్త్రీలకు,పాలిచ్చే తల్లులకు పోషకాలతో కూడిన భోజనం, అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలకు పారితోషికాల పెంపు, మహిళా భద్రతకు చర్యలు షీ టీమ్స్, భరోసా, సఖీ కేంద్రాలు ఇలా ఎన్నో పథకాలను మహిళల కోసం ప్రవేశపెట్టిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.
కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్, మైనారిటీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి , ఐసిడిఎస్ పిడి మధురిమ, మైనారిటీ ఈడీ శ్రీనివాస్, మెప్మా పీడీ బద్రు నాయక్ , కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.