Warangal హనుమకొండలోని లోతట్టు ప్రాంతాల పరిశీలన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి అవసరమైన చర్యలు చేపట్టినట్లు, ప్రజలను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కుడా చైర్మన్లతో కలిసి శనివారం పరిశీలించారు. హన్మకొండ బస్టాండ్ […]
Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి అవసరమైన చర్యలు చేపట్టినట్లు, ప్రజలను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కుడా చైర్మన్లతో కలిసి శనివారం పరిశీలించారు.
హన్మకొండ బస్టాండ్ సమీపంలో వర్షం నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్న సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో సమస్యని పరిష్కరించాలని కోరారని తెలిపారు. లోతట్టు ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వర్షం నీరు నిలవకుండా ఎప్పటికి అప్పుడు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
విద్యుత్ తీగలు తెగడం, పాత గోడలు కూలడం వంటి ప్రమాదాలు పసిగట్టాలని సూచించారు. ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్త పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా,కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.