Shabbir Ali | కేసీఆర్‌ను తరిమికొడతాం.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Shabbir Ali | విధాత ప్రతినిధి, నిజామాబాద్: వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ ను ఇక్కడి నుంచి తరిమి కొడతామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి, గజ్వేల్ లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు. హైదరాబాద్, గజ్వేల్ భూములు అమ్ముకున్న కేసీఆర్.. ఇప్పుడు కామారెడ్డి భూములను అమ్ముకునేందుకు వస్తున్నాడన్నారు. బీఅరెస్ పార్టీని భూస్థాపితం […]

  • Publish Date - August 25, 2023 / 01:32 AM IST

Shabbir Ali |

విధాత ప్రతినిధి, నిజామాబాద్: వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ ను ఇక్కడి నుంచి తరిమి కొడతామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి, గజ్వేల్ లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు. హైదరాబాద్, గజ్వేల్ భూములు అమ్ముకున్న కేసీఆర్.. ఇప్పుడు కామారెడ్డి భూములను అమ్ముకునేందుకు వస్తున్నాడన్నారు. బీఅరెస్ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు.

రింగ్ రోడ్ల పేరుతో పేదల భూములన్నీ లాక్కుంటున్న కేసీఆర్, ఆ భూములన్నీ తన బంధువులకు మార్పిడి చేస్తున్నారని ఆరోపించారు. నాసిరకం డబుల్ బెడ్ రూంలు నిర్మించి ప్రజల ప్రాణాలతో అడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. కవితను జైలుకు పంపే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల అవినీతి చేసిందన్నారు.

తండ్రి కేసీఆర్ లిక్కర్ షాపులు పెడితే కూతురు కవిత ఆ లిక్కర్ దందాకి రాణి అయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రోళ్లు పెప్పర్ స్ప్రే కొట్టినా వెనుకకు రాకుండా తెలంగాణ బిల్ పాస్ చేసిన ధైర్యశీలి సోనియా గాంది అని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్ము ప్రజలకు పంచుతామని చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. బీఅరెస్ హయాంలో విద్య, వైద్యం మూలనపడ్డాయని, బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని బొందపెడతామన్నారు. తాను కామారెడ్డి గడ్డ మీద పుట్టానని, ఇక్కడే చస్తానని, ఒక్కసారి తనను ఆశీర్వదించాలని కోరారు.

Latest News