ఇటీవల మేఘాలయ (Meghalaya) రాజధాని షిల్లాంగ్ (Shillong) లోని ఐఐఎం (IIM) విద్యార్థులు.. ఇంటర్నేషనల్ వీక్ (International Week) లో పాల్గొన్నారు. వారం రోజులపాటు జరిగిన ఈ వీక్ను మేఘాలయ పర్యాటక శాఖ సహకారంతో ఐఐఎం షిల్లాంగ్ (IIM Shillong) నిర్వహించింది.
IIM Shillong : ఇటీవల మేఘాలయ (Meghalaya) రాజధాని షిల్లాంగ్ (Shillong) లోని ఐఐఎం (IIM) విద్యార్థులు.. ఇంటర్నేషనల్ వీక్ (International Week) లో పాల్గొన్నారు. వారం రోజులపాటు జరిగిన ఈ వీక్ను మేఘాలయ పర్యాటక శాఖ సహకారంతో ఐఐఎం షిల్లాంగ్ (IIM Shillong) నిర్వహించింది. ప్రపంచ దేశాల నుంచి విభిన్న నేపథ్యాలు కలిగిన వాళ్లు ఈ వీక్లో పాల్గొన్నారు. పరస్పర సాంస్కృతిక అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ఈ వీక్ను నిర్వహించారు.
ఇంటర్నేషనల్ వీక్లో పాల్గొన్నవారు జైంతియా హిల్స్ జిల్లాలోని తిర్షి జలపాతం సందర్శనతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. పార్టిసిపెంట్స్ జలపాతం బేస్కు చేరుకోవడం కోసం పచ్చని వరి పైరుల మీదుగా సుందరమైన వంపు వంతెనను దాటారు. తిర్షి జలపాతం గుండా నీరు పాలరంగులో నిట్టనిలువుగా కిందకు దూకుతూ పార్టిసిపెంట్స్ను మంత్రముగ్ధులను చేసింది.
ఈ జర్నీలో భాగంగా పార్టిసిపెంట్స్ సాంస్కృతిక ప్రాముఖ్యత, సమాజ స్ఫూర్తికి ప్రిసిద్ధి చెందిన బెహ్డియెన్ఖ్లామ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు చెడు ఆత్మలను తరమడానికి వెదురు స్తంభాలను కర్రలతో కొట్టడం లాంటి సంప్రదాయ ఆచారాలలో ఉత్సాహంగా నిమగ్నమయ్యారు. సంప్రదాయబద్ధమైన అలంకరణలతో డోలు చప్పుళ్లు, సన్నాయి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఫెస్టివల్ ఘనంగా జరుపుకున్నారు.
అనంతరం షిల్లాంగ్లోని ఏకశిలల ప్రాముఖ్యతను విద్యార్థులు పరిశీలించారు. ఆ పురాతన రాళ్లు, వాటి నిర్మాణాల చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకున్నారు. మేఘాలయ వారసత్వ సంపదను చూసి మంత్రముగ్ధులయ్యారు. ఈ ఇంటర్నేషనల్ వీక్ కేవలం విద్యా వేదిక మాత్రమే కాలేదు. అంతర్జాతీయ విద్యార్థులు, స్థానిక సమాజం మధ్య సంబంధాలు, పరస్పరం గౌరవం పెరగడానికి కారణమైంది. ప్రపంచీకరణలో సాంస్కృతిక మార్పిడి ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.